యాప్నగరం

Rajinikanth: లాస్ట్ కాల్ లిఫ్ట్ చేయనందుకు చింతిస్తున్నా.. ఆయన చివరి కోరిక తీరుస్తా: రజినీకాంత్

Mayilsamy's last wish:సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ప్రముఖ తమిళ నటుడు మైల్ సామి మరణించారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన రజినీకాంత్.. మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.

Authored bySanthosh Damera | Samayam Telugu 20 Feb 2023, 5:28 pm

ప్రధానాంశాలు:

  • తమిళ నటుడు మైల్ సామికి రజినీకాంత్ నివాళి
  • కాల్ లిఫ్ట్ చేయనందుకు చింతిస్తున్నట్లు ప్రకటన
  • తప్పకుండా ఆయన చివరి కోరిక తీరుస్తానని వెల్లడి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajinikanth, Mailsamy
Rajinikanth: రజినీకాంత్, మైల్ సామి
Tamil cinema news:ప్రముఖ తమిళ నటుడు మైల్ సామి (Mayilsamy) అనారోగ్య కారణాలతో ఆదివారం తుది శ్వాస విడిచారు. 57 ఏళ్ల వయసున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్నేహితుడు మైల్‌ సామికి నివాళులు అర్పించిన సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. అతని మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. అంతేకాదు సామి చివరిసారి తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం పట్ల చింతిస్తున్నానని, అతని చివరి కోరిక (Last Wish) తప్పకుండా నెరవేరుస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మైల్ సామి ఇంటికి వెళ్లి నివాళులర్పించిన అనంతరం రజినీ మీడియాతో మాట్లాడుతూ అతనితో తనకున్న బంధం గురించి తెలిపారు. తన సన్నిహితుల్లో సామి ఒకడని, 23-24 ఏళ్ల వయసు నుంచి తెలుసని అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నటుడిగా ఎదిగాడని, తామిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయియినప్పటికీ ఎక్కువ సినిమాల్లో కలిసి నటించలేకపోయినట్లు వెల్లడించారు. సామి ప్రతి ఏట కార్తీక దీపం కోసం తిరువణ్ణామలై వెళ్లేవాడని.. అక్కడి జనాలను చూసి తన సినిమా ఫస్ట్ షోకు అంత మంది జనం వచ్చినట్లుగా ఆనందపడేవాడని గుర్తుచేసుకున్నారు. అలాగే కార్తీక దీపం సందర్భంగా తనకు కాల్ చేసి విషెస్ తెలిపేవాడని.. కానీ చివరిసారి కాల్ చేసినప్పుడు పనిలో ఉండి తాను లిఫ్ట్ చేయలేక పోయినట్లు తెలిపారు రజినీ. మూడు సార్లు కాల్ చేశాడని తెలిసి తనకు సారీ చెప్పాలనుకుని మర్చిపోయానని.. ఇప్పుడు చెప్పేందుకు తనే లేడని బాధపడ్డారు.

వివేక్, మైల్ సామి మృతి సినీ పరిశ్రమకు, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకే కాకుండా యావత్ మానవాళికి తీరని లోటని రజినీ తెలిపారు. వారు గొప్ప సామాజిక ఆలోచనాపరులని, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులని ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాదు శివరాత్రి రోజే మైల్ సామి మరణించడం ఆ దేవుడి ప్రణాళికేనని.. అందుకే ఇదే రోజున తన అభిమాన భక్తుడిని తీసుకెళ్లిపోయాడని పేర్కొన్నారు.

అలాగే తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శించాలన్న మైల్‌ సామి కోరికను నెరవేరుస్తానని రజనీ కాంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక గత కచేరీ సందర్భంగా రజనీకాంత్ ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన డ్రమ్స్ శివ మణితో చెప్పారన్న విషయంపై రజినీ స్పందించారు. ఈ విషయం తనకు కూడా తెలిసిందని.. శివ మణితో మాట్లాడి మైల్ సామి చివరి కోరిక తీరుస్తానని చెప్పుకొచ్చారు.


రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.