ప్రపంచవ్యాప్తంగా తలైవా మేనియా
రజనీ సినిమా అంటే తమిళనాట మాత్రమే కాదు దేశ విదేశాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోను రజనీ మేనియా ఓ రేంజ్లో ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7000 స్క్రీన్స్లో విడుదల చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు.
తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్
అంచనాలకు తగ్గట్టుగా సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా రజనీ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వింటేజ్ రజనీని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో రజనీ స్టైల్స్ యాక్షన్ హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్లో రజనీ రేంజ్
సూపర్ స్టార్ సినిమా విడుదలవుతుందంటే కొన్ని కార్పెరేట్ కంపెనీలు సెలవులు కూడా ప్రకటిస్తాయి. దర్బార్ విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగింది. అంతేకాదు పలు కంపెనీ పండుగ కానుకగా ఉద్యోగస్తులకు దర్బార్ సినిమా టికెట్లు కూడా ఇవ్వటం వివేశం. ఇంకా ఆన్లైన్ దర్బార్ టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. తమిళనాటు అడ్వాన్స్ బుకింగ్స్లోనూ సరికొత్త రికార్డ్లను సెట్ చేసింది ఈ సినిమా.
200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. తమిళనాట దర్భార్ థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల ధర పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దాదాపు 15 కోట్లకు తీసుకున్నారు. ఓవర్సీస్ కూడా 30 కోట్లకు పైగా అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరాదితో పాటు ఇతర రాష్ట్రాలు, ఆడియో, శాటిలైట్, డిజిటల్ లాంటి హక్కులు కలుపుకొని దర్బార్ 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తొలి రోజు రికార్డ్ వసూళ్లు
తలైవా మేనియా సూపర్ స్టార్, మురగదాస్ కాంబినేషన్పై ఉన్న హైప్తో ఈ సినిమా తొలిరోజే రికార్డ్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అన్ని భాషల్లో కలిపి భారత్లో దాదాపు 40 కోట్ల వరకు గ్రాస్ సాధిస్తుందని, అదే ఓవర్సీస్ కూడా కలుకుపుకుంటు 60 కోట్ల మార్క్ దాటుతుందని లెక్కలు కడుతున్నారు.