2016లో విడుదలైన కబాలీ మూవీకి సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్పై ఓ డిస్ట్రిబ్యూటర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసి నిండా మునిగానని ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్మాతను నమ్మి... అప్పుల్లో ఇరుకున్నానంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తాను ప్రమాదంలో ఉన్నానని... దీనికి చావే పరిష్కారమ... ఆత్మహత్య చేసుకుంటానని మీడియా ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి తాను పెట్టిన డబ్బులను నిర్మాత థాను తిరిగి ఇచ్చేస్తే.. అప్పులు చెల్లిస్తానని పంపిణీ దారుడు సెల్వకుమార్ అన్నారు.
సెల్వకుమార్ వేలూరు, పాండిచ్చేరి ప్రాంతంలో కబాలి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే మూవీ వల్ల 20 నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని... ఈ సినిమాను పంపిణీ చేయడానికి అప్పు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని వడ్డీ వ్యాపారులు అడుగుతూనే ఉన్నారని... ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదన్నాడు. తన భార్య నగలు అమ్మి కొంత డబ్బు కట్టానని... వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోవాలి అనుకున్నాని చెప్పాడు. ఈ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
ఈ సినిమా పంపిణీ హక్కుల వల్ల దాదాపు రూ.2.8 కోట్లు నష్టపోయానని... రూ.1.5 కోట్లు ఇస్తానని థాను ప్రమాణం చేశారని చెప్పారు. డబ్బులు ఇస్తానని నిర్మాత థాను చెప్పారని.... ఆయన్ను తాను నమ్మానన్నాడు. కానీ తనను అప్పు తీసుకున్న వారు నమ్మడం లేదని... థాను డబ్బులు ఇస్తే.. వారికి ఇచ్చేసి తన దారిని తాను వెళ్లిపోతానన్నాడు. ఇప్పుడు తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని... తన బాధను వ్యక్తం చేశారు. ఈ విషయంలో రజనీకాంత్ ప్రమేయం లేదని సెల్వకుమార్ చెప్పారు. తలైవాను కలిసి తన సమస్యను వివరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సెల్వకుమార్ వేలూరు, పాండిచ్చేరి ప్రాంతంలో కబాలి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే మూవీ వల్ల 20 నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని... ఈ సినిమాను పంపిణీ చేయడానికి అప్పు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని వడ్డీ వ్యాపారులు అడుగుతూనే ఉన్నారని... ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదన్నాడు. తన భార్య నగలు అమ్మి కొంత డబ్బు కట్టానని... వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోవాలి అనుకున్నాని చెప్పాడు. ఈ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
ఈ సినిమా పంపిణీ హక్కుల వల్ల దాదాపు రూ.2.8 కోట్లు నష్టపోయానని... రూ.1.5 కోట్లు ఇస్తానని థాను ప్రమాణం చేశారని చెప్పారు. డబ్బులు ఇస్తానని నిర్మాత థాను చెప్పారని.... ఆయన్ను తాను నమ్మానన్నాడు. కానీ తనను అప్పు తీసుకున్న వారు నమ్మడం లేదని... థాను డబ్బులు ఇస్తే.. వారికి ఇచ్చేసి తన దారిని తాను వెళ్లిపోతానన్నాడు. ఇప్పుడు తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని... తన బాధను వ్యక్తం చేశారు. ఈ విషయంలో రజనీకాంత్ ప్రమేయం లేదని సెల్వకుమార్ చెప్పారు. తలైవాను కలిసి తన సమస్యను వివరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.