యాప్నగరం

Petta vs Viswasam: రజనీ, అజిత్ ఫ్యాన్స్ ఫైట్.. నలుగురికి కత్తిపోట్లు

వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించివేయడంతో వివాదం తలెత్తింది. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు.

Samayam Telugu 10 Jan 2019, 12:21 pm

ప్రధానాంశాలు:

  • తమిళనాడులో రజనీ, అజిత్ సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి
  • దీంతో ఆయా థియేటర్ల వద్ద స్టార్ల అభిమానులు సందడి చేస్తున్నారు
  • వేలూరులోని ఓ థియేటర్ వద్ద ఇద్దరు స్టార్ల అభిమానులు ఘర్షణ పడ్డారు. నలుగురు కత్తిపోట్లకు గురయ్యారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu fans
సంక్రాంతి పండగ నేపథ్యంలో కోలీవుడ్‌లో బిగ్‌ఫైట్ నడుస్తోంది. రజనీ నటించిన ‘పేట’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాలు గురువారం రిలీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు స్టార్ల అభిమానులు ఆయా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. తొలి ఆట చూడాలన్న ఉత్సాహంతో వేలాది మంది అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో వారి ఆనందం మిన్నంటింది. అయితే అభిమానులు హద్దులు దాటి ఘర్షణకు దిగారు. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ అలజడి సృష్టించారు.
వేలూరులోని ఓ థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానుల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రజనీకాంత్ ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చించివేయడంతో వివాదం తలెత్తింది. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు కత్తులతో దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రెండు సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. అభిమానం పేరుతో అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.