‘రాక్షసుడు’ సినిమా విజయవంతం కావడంపై చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, మల్టీడైమెన్షన్ వాసు, దర్శకుడు రమేశ్ వర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘‘సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడుపోగా.. హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90 కోట్లకు విక్రయించాం. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్కు పెట్టిన మొత్తం రూ.12 కోట్లు నిన్నటికే వచ్చాయి. చాలా చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగింది’’ అని వెల్లడించారు.
అయితే, తొలి వారం కన్నా రెండో వారం కలెక్షన్లు బాగున్నాయని సురేష్ చెప్పారు. ‘‘వైజాగ్, తూర్పు గోదావరి హక్కులను నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా లాభంతోనే స్టార్ట్ అయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. తమిళంలో కూడా తొలి వారం కంటే రెండు, మూడు వారాల్లోనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, నిర్మాత కొనేరు సత్యనారాయణగారికి, హవీశ్గారికి రుణపడి ఉంటాను’’ అని సురేష్ అన్నారు.
ఇంత మంచి సినిమాను తన కుమారుడితో చేసిన రమేశ్ వర్మకి ఈ సందర్భంగా సురేష్ థ్యాంక్స్ చెప్పారు. శ్రీనివాస్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. అయితే, ‘అల్లుడు శీను’ని మించిన ఎంటర్టైన్మెంట్, పాటలుండాలని.. అలాంటి కథ కోసం వెతుకుతున్నానని అన్నారు. తన కుమారుడిని స్టార్ హీరోని చేయాలనే ఇప్పటి వరకు పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చానని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతానికి తనకంటూ మార్కెట్ క్రియేట్ అయ్యిందన్నారు. యూట్యూబ్లో శ్రీనివాస్కు మంచి బిజినెస్ జరుగుతుందన్నారు. ఈ సినిమా తరవాత కాస్త గ్యాప్ తీసుకున్నా పరావాలేదు కానీ.. మంచి కథ కుదిరిన తర్వాతే కొత్త సినిమాను ప్లాన్ చేస్తామని స్పష్టం చేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం సినిమాను చేశాం. ఓ హిట్ సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ ఇది. దీన్నొక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పవచ్చు. సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అని అన్నారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ‘‘సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు అయ్యింది. సినిమా బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడుపోగా.. హిందీ శాటిలైట్ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్ రూ.5.90 కోట్లకు విక్రయించాం. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్ రైట్స్కు పెట్టిన మొత్తం రూ.12 కోట్లు నిన్నటికే వచ్చాయి. చాలా చోట్ల వర్షం వల్ల అంతరాయం కలిగింది’’ అని వెల్లడించారు.
అయితే, తొలి వారం కన్నా రెండో వారం కలెక్షన్లు బాగున్నాయని సురేష్ చెప్పారు. ‘‘వైజాగ్, తూర్పు గోదావరి హక్కులను నేనే కొన్నాను. వైజాగ్ ఏరియాలో నిన్నటికే రూ.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా లాభంతోనే స్టార్ట్ అయ్యింది. వర్షం లేకుంటే కలెక్షన్స్ సునామీ సృష్టించేది. తమిళంలో కూడా తొలి వారం కంటే రెండు, మూడు వారాల్లోనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్ వర్మగారికి, నిర్మాత కొనేరు సత్యనారాయణగారికి, హవీశ్గారికి రుణపడి ఉంటాను’’ అని సురేష్ అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా మన సెన్సిబిలిటీస్ ప్రకారం సినిమాను చేశాం. ఓ హిట్ సినిమాను రీమేక్ చేయడం చాలా కష్టం. అండర్ ప్లే చేయాల్సిన క్యారెక్టర్ ఇది. దీన్నొక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పవచ్చు. సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అని అన్నారు.