యాప్నగరం

నా చిట్టి తమ్ముడు అంత ఎదిగిపోయాడా.. రొమాన్స్‌పై రకుల్ ఆశ్చర్యం

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరవాత అంచెలంచెలుగా టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇంచుమించుగా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించేశారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చారు. రకుల్ తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. ఆ సినిమా తరవాత మరే తెలుగు సినిమాను రకుల్ అంగీకరించలేదు. తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలో ప్రస్తుతం రకుల్ నటిస్తున్నారు.

Samayam Telugu 16 Feb 2020, 8:06 pm
Samayam Telugu rakul preet singh surprises over her brother romancing in poddhunne lesthune song from ninne pelladatha
నా చిట్టి తమ్ముడు అంత ఎదిగిపోయాడా.. రొమాన్స్‌పై రకుల్ ఆశ్చర్యం
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరవాత అంచెలంచెలుగా టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇంచుమించుగా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించేశారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చారు. రకుల్ తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. ఆ సినిమా తరవాత మరే తెలుగు సినిమాను రకుల్ అంగీకరించలేదు. తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలో ప్రస్తుతం రకుల్ నటిస్తున్నారు.

హీరోగా రకుల్ తమ్ముడు

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు సినిమాలను ఈ కుర్ర హీరో అంగీకరించారు. ప్రస్తుతం ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా టైటిల్ ‘నిన్నే పెళ్లాడతా’. శ్రీ కోనేరి ప్రొడక్షన్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లలో వస్తోన్న తొలి సినిమా ఇదే. వైకుంఠ్ బోను దర్శకుడు. సాయి కిరణ్ కోనేరి సహ నిర్మాత.

పాట విడుదల చేసిన అడివి శేష్

‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా సినిమా నుంచి పాటను విడుదల చేశారు. ‘పొద్దున్నే లేస్తూనే’ అంటూ సాగే ఈ పాటను అడివి శేష్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను హేమచంద్ర ఆలపించారు. మిక్స్‌డ్ ర్యాప్‌తో యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది ఈ పాట.

తమ్ముడు ఎదిగిపోయాడు..

తన తమ్ముడు హీరోగా నటిస్తోన్న సినిమాలోని పాటను ప్రొమోట్ చేస్తూ రకుల్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నా చిట్టి తమ్ముడు ఇంతలా ఎదిగిపోయాడంటే నమ్మలేకపోతున్నాను!! రొమాన్స్‌తో పాటు అన్నీ చేసేస్తున్నాడు. పొద్దున్నే లేస్తూనే లిరికల్ సాంగ్ ఇప్పుడు మీ అందరిదీ. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. పాటను విడుదల చేసినందుకు అడివి శేష్‌కి థ్యాంక్స్’’ అని రకుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Twitter-Rakul Singh

నాగార్జున ఆశీస్సులు..

రకుల్ తమ్ముడు సినిమాకు కింగ్ నాగార్జున ఆశీస్సులు ఎప్పుడో అందేశాయి. ఈ సినిమా టైటిల్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఎందుకంటే ఈ సూపర్ హిట్ టైటిల్ ఆయనదే కాబట్టి. ఇక, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. సాయికుమార్, అన్నపూర్ణమ్మ, సీత, ఇంద్రజ, సిజ్జు, మధునందన్, విద్యుల్లేఖ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధికా శర్మ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.