యాప్నగరం

కట్నం తీసుకునే అబ్బాయిలపై హీరోయిన్ ఆగ్రహం!

వరకట్నం తీసుకునే అబ్బాయిలపై ఆగ్రహం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

TNN 14 Nov 2017, 2:45 pm
వరకట్నం తీసుకునే అబ్బాయిలపై ఆగ్రహం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అలాంటి అబ్బాయిలపై చర్యలు తీసుకోవాలని, కట్నానికై భార్యలను వేధించే వాళ్లపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని రకుల్ పోలీసులను కోరింది. సమాజంలో స్త్రీలను వివక్షతో చూడటం పట్ల రకుల్ మండిపడింది. చిల్ట్రన్స్ డే సందర్భంగా రకుల్ సామాజిక అంశాలపై మాట్లాడింది. బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రకుల్ పాల్గొంది.
Samayam Telugu rakul voice raise against dowry harassments
కట్నం తీసుకునే అబ్బాయిలపై హీరోయిన్ ఆగ్రహం!


ఈ సందర్భంగా సామాజిక అంశాలపై రకుల్ స్పందించింది. పిల్లల విషయంలో ఆడ,మగ వ్యత్యాసం వద్దని రకుల్ పిలుపునిచ్చింది. పాప, బాబుల మధ్య వ్యత్యాసం చూపవద్దని తల్లిదండ్రులను కోరింది. అందరూ సమానమే అని అంది. కొంతమంది లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకుని.. ఆడపిల్లలను అమ్మ కడుపులోనే చంపేస్తుండటంపై రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.

వివక్ష రహిత సమాజం కావాలని ఆకాంక్షించింది. ఆడవాళ్లపై వేధింపులు ఆగాలని, మహిళల అక్రమ రవాణాను నిరోధించాలని, బాల్య వివాహాలను నిర్మూలించాలని పోలీసులను కోరింది రకుల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.