ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే హీరో రాంచరణ్.. దర్శకుడు సురేందర్ రెడ్డి పిల్లలతో తెగ ఆడేసుకున్నారు. బుల్లి కారులో సురేందర్ ఇద్దరి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్లని ఆడించారు. ఇదేంటి రాంచరణ్.. సురేందర్ రెడ్డి పిల్లల్ని ఆడించడమేంటి అనుకుంటున్నారా?.. అయితే విషయంలోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమా బేసిక్ స్టోరీ లైన్ను కూడా పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో అందించారు. దీనికి సురేందర్ రెడ్డి మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా స్క్రిప్టుకి సంబంధించిన విషయాలపై చర్చించడానికి రాంచరణ్ ఆదివారం సాయంత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్లేటప్పుడు సురేందర్ పిల్లలకి గిఫ్టులు కూడా తీసుకెళ్లారు. బహుమతులను వాళ్లకి ఇవ్వడంతో పాటు కొంతసేపు వారితో ఆడుకున్నారు. కాగా, విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో ఈ గొప్ప చారిత్రాత్మక కథను మంచి కమర్షియల్ సినిమాగా మలచాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా మంచి నిర్మాణ విలువలతో ‘ఉయ్యాలవాడ’ను తెరకెక్కిస్తారట. ఈ మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా స్క్రిప్టుకి సంబంధించిన విషయాలపై చర్చించడానికి రాంచరణ్ ఆదివారం సాయంత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్లేటప్పుడు సురేందర్ పిల్లలకి గిఫ్టులు కూడా తీసుకెళ్లారు. బహుమతులను వాళ్లకి ఇవ్వడంతో పాటు కొంతసేపు వారితో ఆడుకున్నారు. కాగా, విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో ఈ గొప్ప చారిత్రాత్మక కథను మంచి కమర్షియల్ సినిమాగా మలచాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా మంచి నిర్మాణ విలువలతో ‘ఉయ్యాలవాడ’ను తెరకెక్కిస్తారట. ఈ మే నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.