యాప్నగరం

చెర్రీ పొమ్మన్నాడు.. ఎన్టీఆర్ రమ్మన్నాడు!

క్యూట్ అందాల రాశీఖన్నాకు వింత అనుభవం ఎదురైంది. ఇందుకు ఆమె సంతోషించాలా? బాధపడాలా అని సందిగ్ధంలో పడింది.

TNN 20 Jan 2017, 6:43 pm
రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రంలో... హీరోయిన్‌గా రాశీ ఖన్నాను ఎంపిక చేసుకున్నారు. మెగా ప్రాజెక్ట్‌లో చోటు దొరికేసరి ఆమె ఎగిరి గంతేసింది. అయితే, చెర్రీ ఆమెకు బదులు అనుపమా పరమేశ్వరన్‌‌పై ఆసక్తి చూపడంతో ఆఖరి క్షణంలో రాశీని రిజెక్ట్ చేశారు. ‘అ.ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానంభవతి’ వంటి వరస హిట్లతో మాంచి ఫామ్‌లో ఉన్న అనుపమ ఇప్పుడు టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా మారింది. అందుకే, చరణ్ ఆసక్తి చూపి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పైగా, సుకుమార్ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో నడుస్తుందని తెలిసింది. ఇందులో అనుపమా కరెక్ట్‌గా ఇమిడి పోతుందని భావించారనే టాక్ ఉంది.
Samayam Telugu ram charan rejected ntr accepted raashi khanna
చెర్రీ పొమ్మన్నాడు.. ఎన్టీఆర్ రమ్మన్నాడు!


చెర్రీ చిత్రం దూరమైనా.. చిన్న ఎన్టీఆర్ సినిమాలో మాత్రం అమ్మడు చోటు కన్ఫామ్ చేసుకుంది. ‘జై లవ కుశ’లో త్రిపుల్ రోల్ చేస్తున్న ఒక ఎన్టీఆర్‌ సరసన... ఆమె సెట్ అయిపోయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. ఆగస్టు 11న విడుదలయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.