యాప్నగరం

తొమ్మిదేళ్ల కోరిక నెరవేరింది: రామ్‌చరణ్

‘మగధీర’ రూపంలో కెరీర్‌లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని తనకు రాజమౌళి, విజయేంద్రప్రసాద్ అందించారని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు.

TNN 11 Sep 2017, 5:59 pm
‘మగధీర’ రూపంలో కెరీర్‌లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని తనకు రాజమౌళి, విజయేంద్రప్రసాద్ అందించారని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. ‘నా అభిమానులంతా గర్వంగా చెప్పుకునే సినిమాను ఇచ్చారు. ఆ కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, తొమ్మిదేళ్లుగా నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ‘శ్రీవల్లి’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అందుకు వేదిక కావడం గర్వంగా ఉంది’ అని రామ్‌చరణ్ ఆనందం వ్యక్తం చేశారు.
Samayam Telugu ram charan speech in sri valli pre release function
తొమ్మిదేళ్ల కోరిక నెరవేరింది: రామ్‌చరణ్


ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహివంచిన చిత్రం ‘శ్రీవల్లి’. రజత్, నేహాహింగే జంటగా నటించారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌చరణ్ ప్రీ రిలీజ్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మగధీర తర్వాత తాను, విజయేంద్రప్రసాద్ మళ్లీ ఇదే వేదికపై మళ్లీ కులుసుకున్నామని చెప్పారు.

‘ఈ తండ్రీకొడుకులు ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ హీరోకు బ్లాక్‌బాస్టర్ హిట్లిచ్చారు. బాలీవుడ్‌లో ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత ప్రస్తుతం ‘మణికర్ణిక’ చిత్రానికి కథను అందిస్తున్నారు విజయేంద్రప్రసాద్. ఆ సినిమా మరో ‘బాహుబలి’, ‘మగధీర’ కావాలని కోరుకుంటున్నాను. గొప్ప రచయిత కథను రాసి తానే దర్శకత్వం వహిస్తే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా కోసం అందరిలాగే నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.