యాప్నగరం

రామ్ చరణ్‌తో మరోసారి దిల్ రాజు!

దిల్ రాజు ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' సినిమాను నిర్మిస్తున్నారు.

TNN 8 May 2017, 5:13 pm
దిల్ రాజు ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' వంటి మీడియం బడ్జెట్ సినిమాతో పాటు ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా గతంలో ఈ నిర్మాత 'ఎవడు' అనే చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Samayam Telugu ram charan teams up with dil raju again
రామ్ చరణ్‌తో మరోసారి దిల్ రాజు!


సుకుమార్‌తో సినిమా పూర్తయిన తరువాత చరణ్.. మణిరత్నంతో సినిమా చేయాల్సివుంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సుకుమార్ సినిమా దసరాకు విడుదల కానుంది. ఈలోగా తన తదుపరి సినిమా విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. దీంతో చరణ్ తదుపరి సినిమా తన బ్యానర్‌లో ఉండే విధంగా దిల్ రాజు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్‌తో దిల్ రాజు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. చరణ్ కోసం ఓ భారీ బడ్జెట్ యాక్షన్ కథను సిద్ధం చేయమని చెప్పారట. కథ గనుక దిల్ రాజుని మెప్పిస్తే ఇక ఈ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కడం ఖాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.