యాప్నగరం

మంచిపని కోసం చెర్రీ-ఉపాసన దంపతుల మద్ధతు

ఒక మంచి ఆశయంతో చేపట్టే ఏ పనికైనా తమ మద్దతు ఎప్పుడూ వుంటుందని తరచుగా నిరూపించుకుంటూనే వున్నారు...

TNN 15 Sep 2017, 8:42 pm
ఒక మంచి ఆశయంతో చేపట్టే ఏ పనికైనా తమ మద్దతు ఎప్పుడూ వుంటుందని తరచుగా నిరూపించుకుంటూనే వున్నారు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు. తాజాగా ర్యాలీ ఫర్ రివర్స్ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ని కలిసిన దంపతులు.. ఉద్యమంలా మొదలైన 'ర్యాలీ ఫర్ రివర్స్'కి తమ మద్దతు ప్రకటించారు. రైతులకి, పర్యావరణానికి మేలు చేసే నదులని పరిరక్షించుకోవాలనే సదుద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని అభిప్రాయపడ్డారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు.
Samayam Telugu ram charan upasana kamineni couple supports rally for rivers campaign
మంచిపని కోసం చెర్రీ-ఉపాసన దంపతుల మద్ధతు


ఈ సందర్భంగా దంపతులు ఇద్దరూ జగ్గీ వాసుదేవ్‌తో కలిసి తీసుకున్న ఫోటో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటూ వారికి వెయిట్ లాస్ టిప్స్ చెబుతున్న ఉపాసన తాను కూడా బాగా బరువు తగ్గిందనే ఈ విషయం ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది అంటున్నారు నెటిజెన్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.