యాప్నగరం

మానవసేవే మాధవసేవ అనిపించిన ఉపాసన.. మల్లన్న సన్నిధిలో ధాతృత్వం

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన. సుమారు 75 రోజుల తరువాత స్వామి వారి దర్శనానికి అనుమతులు లభించడంతో మంగళవారం నాడు మల్లన్నను దర్శించుకున్నారామె.

Samayam Telugu 9 Jun 2020, 5:18 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణెదల మానవసేవే మాధవ సేవ అనిపించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లిన ఆమె భారీ ఎత్తున నిత్యావసరాలు పంపిణీ చేసి ధాతృత్వం చాటుకున్నారు. సుమారు 75 రోజుల తరువాత ఏపీలోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయం తెరుచుకోగా మెగా కోడలు ఉపాసన మంగళవారం నాడు దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో దర్శనానికి 300 మంది భక్తలను చొప్పున అనుమతి ఇస్తుండగా.. మంగళవారం నాడు భక్తులు రద్దీ సాధారణంగానే ఉంది.
Samayam Telugu ఉపాసన (Upasana visit srisailam temple)
Upasana visit srisailam temple


కాగా మంగళవారం ఉదయం ఆలయ నిబంధనలను పాటిస్తూ మల్లన్న దర్శనానికి వెళ్లారు ఉపాసన. అనంతరం స్థానికంగా ఉన్న ప్రజలకు, ఆలయ సిబ్బందికి పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఉపాసన. పెద్ద లారీలతో ఈ సరుకులను తీసుకువచ్చారు. సుమారు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు.. బియ్యం, పప్పులు, నూనెలు అందించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని కోరారు ఉపాసన. చాలారోజుల తరువాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఉపాసన.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.