యాప్నగరం

రంగస్థలం హిట్.. తిరుమల మెట్లెక్కిన ఉపాసన

రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ సూపర్ హిట్ కావడంతో అతడి భార్య ఉపాసన కాలినడకన తిరుమలేశుణ్ని దర్శించుకుంది.

Samayam Telugu 13 Apr 2018, 1:07 pm
రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ అదిరిపోయే హిట్ కొట్టాడు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ బాహుబలి సినిమాల తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక చెర్రీ నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మావాడు ఇరగదీశాడంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మగధీర తర్వాత రామ్ చరణ్ ఆ రేంజ్‌లో కొట్టిన హిట్ కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంది. అబ్బాయ్ హిట్ కొట్టిన ఆనందంలో.. బాబాయ్ పవన్ కల్యాణ్ రంగస్థలం సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరి రంగస్థలం సూపర్ సక్సెస్‌తో చరణ్ భార్య ఉపాసన ఆనందానికి హద్దుంటుందా..?
Samayam Telugu upasanaa


మిస్టర్ సి అని చెర్రీని ముద్దుగా పిలుచుకునే ఉపాసన.. రంగస్థలం హిట్ కావడంతో తిరుమలేశుణ్ని దర్శించుకుంది. రామ్ చరణ్ స్టామినాకు తగ్గ విజయం దక్కిన ఆనందంలో ఆమె కాలినడక వేంకటేశ్వరుణ్ని చేరుకుంది. తిరుమల మెట్ల మార్గం, మెట్లెక్కడానికి ముందు టెంకాయ కొడుతూ దిగిన ఫొటోలను ఉపాసన ట్వీట్ చేసింది.

తాను కాలినడకన తిరుమల వెళ్లింది రంగస్థలం హిట్ కావడంతోనే అని చెప్పడం కోసం ఉపాసన ఆ ట్వీట్‌కు రామ్ చరణ్, రంగస్థలం అనే హ్యాష్‌ట్యాగ్‌లను తగిలించింది. ‘మిస్టర్ సి’ అంటే తనకెంత ప్రేమో మిసెస్ చరణ్ మరోసారి చాటి చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.