యాప్నగరం

వర్మ కొత్త సినిమా.. ఈసారి సరైన టాపిక్ ఎంచుకున్నారు

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి ఓ మంచి స్టోరీని ఎంపిక చేసుకున్నారు. తన తర్వాతి సినిమా దిశ రేప్ కేసుపై అంటూ వర్మ ప్రకటించారు.

Samayam Telugu 1 Feb 2020, 1:58 pm
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. తెలంగాణకు చెందిన వెటర్నరీ వైద్యురాలిని నలుగురు వ్యక్తులు మద్యం తాగించి దారుణంగా రేప్ చేసి సజీవదహనం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణ పోలీసులు దిశ నిందితులను కాల్చి చంపినా ఇంకా ఆ ఘటన తెలుగు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అందుకే ఈసారి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఘటనను తన తర్వాతి సినిమా కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
Samayam Telugu ram gopal varma
రామ్ గోపాల్ వర్మ


READ ALSO: అలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రచ్చ

‘‘నా తర్వాతి సినిమా పేరు ‘దిశ’. దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోంది. ‘నిర్భయ’ హత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. ఒకప్పటి రేపిస్ట్‌ల నుంచి కొత్తగా వస్తున్న రేపిస్ట్‌లు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ సినిమాలో భయంకరమైన గుణపాఠంగా చెప్పబోతున్నాను. నిర్భయను రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి పరిస్థితి తమకు ఎదురుకాకూడదని దిశను రేపిస్ట్‌లు కాల్చి చంపేశారు’’ అని వెల్లడించారు. అంతేకాదు ‘నిర్భయ’ దోషులను ఈరోజే ఉరి వేయాల్సి ఉంది. కానీ నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేసి స్టే విధించేలా చేశారు. దీనిపై వర్మ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

See Photo Story: జార్జిరెడ్డి హీరోయిన్ ముస్కాన్ సెక్సీ పోజులు

‘‘నిర్భయను జంతువుల్లాంటి వ్యక్తులు రేప్ చేశారు. ఇప్పుడు ఆమెను మన న్యాయవ్యవస్థ రేప్ చేస్తోంది. మిస్టర్ నరేంద్ర మోదీ.. నిర్భయ తల్లిదండ్రుల బాధను మీరు అర్థం చేసుకోగలరా? అన్ని కోర్టులు కలిసి దోషులకు ఉరి పడకుండా చేస్తున్నాయి. నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లికి సవాలు విసిరాడట. దోషులకు ఎప్పటికీ ఉరి పడదు అని అన్నాడట. వినడానికి ఇంతకంటే దరిద్రమైన విషయం మరొకటి ఉండదు. ఏపీ సింగ్ లాంటి నీచమైన లాయర్ కూడా న్యాయవ్యవస్థను తనవైపు తిప్పేసుకుంటున్నాడు. దీనిని బట్టి క్లియర్‌గా అర్థమైందేంటంటే.. ప్రజలకు న్యాయవ్యవస్థపై కంటే తెలంగాణ పోలీసులపైనే ఎక్కువ నమ్మకం ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.