యాప్నగరం

RGV: కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా.. మళ్లీ కెలికిన ఆర్జీవీ.. బండ బూతులు తిడుతోన్న జనసేనాని ఫ్యాన్స్

దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రోజూ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తుతారు. ఆయన చేసే ట్వీట్లు చర్చకు దారి తీయడమే కాకుండా.. ఆయన్నే బండ బూతులు తిట్టించుకునేలా చేస్తాయి. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ దీనికే దారితీసింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఆర్జీవీ మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మను బండ బూతులు తిడుతున్నారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 11 Jan 2023, 2:44 pm

ప్రధానాంశాలు:

  • చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ దోస్తీపై ఆర్జీవీ ట్వీట్
  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా తాను హర్ట్ అయ్యానంటూ సెటైర్
  • ఆర్జీవీ వ్యాఖ్యలపై మండిపడుతోన్న జనసేనాని అభిమానులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RGV and Pawan Kalyan
రాంగోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఈ మధ్య ట్విట్టర్ వేదికగా పరోక్షంగా విమర్శలు చేస్తోన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ దోస్తీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీంతో రాంగోపాల్ వర్మను పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతున్నారు.
‘‘కేఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు. సిబి కూడా గొంతెత్తి అదే పాట. అననిది ఒక్క పి ఒక్కడే. అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా? యాజ్ ఏ పి ఫ్యాన్, ఐ హర్టెడ్’’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇక్కడ సిబి అంటే చంద్రబాబు నాయుడు అని.. పి అంటే పవన్ కళ్యాణ్ అని ఎవరికైనా అర్థమవుతోంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా? అన్న విమర్శ వివాదాస్పదంగా ఉంది. ఇదే పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇంతకు ముందు కూడా రాంగోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రాంగోపాల్ వర్మ మూడు రోజుల క్రితం వివాదస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అందరి మాట. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తనను నమ్ముకున్న కాపులను పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడికి అమ్మేశారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ చేస్తున్న వరుస ట్వీట్లు జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

మరోవైపు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా రాంగోపాల్ వర్మ ట్వీట్లు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు పర్యటనలో జరిగిన ప్రమాదం గురించి రాంగోపాల్ వర్మ ప్రస్తావిస్తూ.. చంద్రబాబు నరహంతకుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాంగోపాల్ వర్మపై విరుచుకుపడ్డారు. బండబూతులు తిట్టారు. కానీ, ఎవరు ఏమన్నా.. ఎన్ని తిట్టినా రాంగోపాల్ వర్మ మాత్రం మారే ప్రసక్తే లేదు. వివాదమే ఆయన ఆయుధం. రోజూ తన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవాలి. ఆఖరికి ఆయన్ని ఎంతో అభిమానించిన వాళ్లు కూడా ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.