యాప్నగరం

రామ్ గోపాల్ వర్మకు కరోనా.. ‘మర్డర్’ కేసు విచారణకు డుమ్మా

తనకు కరోనా వైరస్ సోకిందని రామ్ గోపాల్ వర్మ నల్గొంగ ఎస్సీ, ఎస్టీ కోర్టుకు స్పష్టం చేశారు. కరోనా సోకిన కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయానని పేర్కొన్నారు.

Samayam Telugu 11 Aug 2020, 5:10 pm
రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ సోకిందని, ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వచ్చిన వార్తలను ఖండిస్తూ, మీడియాపై సెటైర్లు వేస్తూ ఈ మధ్య ఈ సంచలన దర్శకుడు ఒక వీడియో వదిలారు. చేతిలో డంబెల్ పట్టుకుని వర్కౌట్స్ చేస్తూ తాను చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానంటూ వెల్లడించారు. కానీ, వర్మకు కరోనా వైరస్ సోకిందని ఆయన లాయర్ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విన్నవించారు. కరోనా సోకిన కారణంగా తన క్లయింట్ విచారణకు హాజరుకాలేకపోయారని తెలిపారు.
Samayam Telugu రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma


తన అనుమతి లేకుండా తన జీవిత కథపై రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమాను తీస్తున్నారని, తనను బజారుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు.

Also Read: రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్.. నేరుగా అప్సరా రాణితో ఎంజాయ్ చేసే ఛాన్స్ మీదే.. ఇక రచ్చ రచ్చే!!

కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని వర్మ న్యాయవాదిని కోర్టు అడగగా.. తన క్లయింట్‌కు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి వాయిదా కోర్టు వాయిదా వేసింది. మరి ఆరోజైనా వర్మ కోర్టుకు వస్తారో లేదో చూడాలి. ‘మర్డర్’ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వర్మ పర్యవేక్షిస్తున్నారు. అలాగే, చిత్ర నిర్మాణంలో ఆయనకి భాగముంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.