యాప్నగరం

రామ్‌చరణ్ వీరాభిమాని.. బాలధీర ఇక లేరు

రామ్ చరణ్ వీరాభిమాని, బాలుడు పరశురామ్ ఇక లేరు. రామ్ చరణ్‌కి బాల వీరాభిమానిగా వార్తల్లోకెక్కి...

TNN 15 Jul 2017, 5:20 pm
రామ్ చరణ్ వీరాభిమాని, బాలుడు పరశురామ్ ఇక లేరు. రామ్ చరణ్‌కి బాల వీరాభిమానిగా వార్తల్లోకెక్కి, చెర్రీ నటించిన మగధీర సినిమాలోంచి అనేక డైలాగ్స్‌ని అవలీలగా చెప్పి సోషల్ మీడియా సంచలనంగా మారిన పదేళ్ల పరశురామ్ కామెర్ల వ్యాధితో మృతిచెందారు. గద్వాల జిల్లా అయిజకి చెందిన పరశురామ్ మగధీర సినిమా డైలాగ్స్ చెప్పడం చూసి ముచ్చటపడిన రామ్ చరణ్ ఓసారి ఆ బాలుడికి తనని కలిసే అవకాశం ఇచ్చారు.
Samayam Telugu ramcharans fan bala parashuram died from jaundice
రామ్‌చరణ్ వీరాభిమాని.. బాలధీర ఇక లేరు


రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో తనని కలిసిన పరశురామ్‌తో చాలాసేపు ముచ్చటించిన తర్వాత బాలుడి టాలెంట్ చూసి ఆనందం వ్యక్తంచేశాడు చరణ్. అంతేకాకుండా పేదరికం కారణంగా పరశురామ్ చదువుకోలేకపోయాడని తెలిసి ఆవేదన చెందిన చరణ్.. ఇకపై అతడి చదువుకి అవసరమయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

అలా మగధీర డైలాగ్స్‌తో గుర్తింపు పొందిన పరశురామ్ సోషల్ మీడియాతో టచ్‌లో వుండేవాళ్లందరికీ బాలధీరగా సుపరిచితుడయ్యాడు. రామ్ చరణ్ అందిస్తున్న ఆర్థిక సహాయంతో పరశురామ్ చదువుకి ఇక ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో అతడిని కామెర్ల వ్యాధి బలితీసుకోవడం స్థానికులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.