యాప్నగరం

ఎంతో ఆతృతగా ఉంది.. పవన్ కళ్యాణ్‌తో ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా: రానా దగ్గుబాటి

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు రానా.

Samayam Telugu 21 Dec 2020, 7:26 pm
రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోటంతో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌ని నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఈ మూవీలో పవన్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలుపుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు రానా.
Samayam Telugu పవన్ కళ్యాణ్‌తో ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా: రానా దగ్గుబాటి
Rana Pawan Kalyan


స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు బళ్లాల దేవ రానా. విలక్షణ కథలను ఎంచుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపించడం రానా స్టైల్. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై ట్వీట్ చేసిన ఆయన.. ''సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ మూవీ సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగుపెట్టాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా'' అని పేర్కొన్నారు.

Also Read: అరియానా తోపు అంటూ రెచ్చిపోయిన స్నేహితులు.. బోల్డ్ బ్యూటీకి ఘన స్వాగతం పలుకుతూ రచ్చ రచ్చ

సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. థమన్ బాణీలు కట్టనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. జనవరి నెల ఆరంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.