యాప్నగరం

సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్‌ని కలిసిన రానా దగ్గుబాటి

సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్‌ని కలిశారు రానా దగ్గుబాటి. ఈ భేటీలో..

TNN 21 May 2017, 11:38 am
రాజీవ్ గాంధీ హత్య కేసుని దర్యాప్తు చేసిన సీబీఐ బృందానికి బాస్‌గా వ్యవహరించిన డీఆర్ కార్తికేయన్‌ని కలిశారు రానా దగ్గుబాటి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ బేటీ జరిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన తీరు, ఆ తర్వాతి పరిణామాల ఆధారంగా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 'ఆస్పోట- ది హ్యూమన్ బాంబ్' అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా దగ్గుబాటి సీబీఐ ఆఫీసర్ కార్తికేయన్ పాత్ర పోషిస్తున్నాడు.
Samayam Telugu rana daggubati met dr karthikeyan for rajiv gandhi assassinations details
సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్‌ని కలిసిన రానా దగ్గుబాటి


ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ఏఎంఆర్ రమేష్ ఇటీవలే హైదరాబాద్ వచ్చి రానా నివాసంలో రానాని కలిసి అతడికి హిందీ, తెలుగు స్క్రిప్ట్ అందజేశారు. ఆ సమయంలో రానా బాబాయి విక్టరీ వెంకటేష్ కూడా రమేష్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నట్టు సమాచారం.

ఇదిలావుంటే, కార్తికేయన్ పాత్ర పోషించడానికి సిద్ధపడిన రానా దగ్గుబాటి, ఆ పాత్ర తీరుతెన్నులని అధ్యయనం చేసేందుకు కార్తికేయన్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మరింత సమాచారం కోసం కార్తికేయన్ తాను రచించిన 'రాజీవ్ గాంధీ అసాసినేషన్- ది ఇన్వెస్టిగేషన్' అనే బుక్‌ని సైతం రానాకి బహుమతిగా అందించారు.

తమిళనాడుకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన డీఆర్ కార్తికేయన్ పూర్తి పేరు దేవరాయపురం రామసామి కార్తికేయన్. సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా పని చేసి రిటైర్ అయిన కార్తికేయన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి డైరెక్టర్ జనరల్‌గానూ వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.