యాప్నగరం

రెండోపెళ్లి వ్యక్తిని చేసుకోవడంపై హీరోయిన్..!

బాలీవుడ్ లో బడా నిర్మాత ఆదిత్య చోప్రా. అంతేనా.. ఒకనాటి స్టార్ హీరోయిన్

Samayam Telugu 30 Mar 2018, 8:29 pm
బాలీవుడ్ లో బడా నిర్మాత ఆదిత్య చోప్రా. అంతేనా.. ఒకనాటి స్టార్ హీరోయిన్ రాణిముఖర్జీకి భర్త కూడా ఇతను. వీళ్లిద్దరూ చాలా సంవత్సరాల పాటు డేటింగ్ లో ఉండి.. తర్వాత వివాహం చేసుకున్నారు. అప్పటి వరకూ వీరి ప్రేమ కథ గురించి బోలెడన్ని రూమర్లు వచ్చాయి. అయితే వాటన్నింటి మీదా స్పందించకుండా కామ్ గా ఉండిన ఈ జంట చివరకు పెళ్లి చేసుకుంది. విదేశం వెళ్లి అక్కడే పెళ్లి తతంగాన్ని పూర్తి చేసుకుని, స్వదేశం వచ్చి పెళ్లి విషయాన్ని ప్రకటించింది.
Samayam Telugu ranim


ఇటీవలే ఈ జంటకు సంతానం కూడా కలిగింది. ఇప్పుడు రాణి ముఖర్జీ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ తమ ప్రేమకథను, పెళ్లి కథను వివరించింది రాణి.

ఆదిత్యచోప్రా కు 2001లో మొదట పెళ్లైంది. 2009 కళ్లా అతడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అప్పట్లోనే రాణితో ప్రేమలో పడ్డాడు అతడు. ఆ తర్వాత రాణి, ఆదిత్యలు సహజీవనంలో ఉన్నట్టుగా వార్తలు వచ్చేవి. చివరకు వీరు 2014లో పెళ్లి చేసుకున్నారు.

ఇంతకీ రెండో పెళ్లి వాడైన ఆదిత్యలో రాణికి ఏం నచ్చింది? తనను ఎంతో మంది ప్రేమిస్తున్నా తను మాత్రం అతడిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే.. అతడు చూపించే ‘గౌరవమే’అంటోంది రాణి ముఖర్జీ. ఆదిత్య తనను ఎంతగానో గౌరవిస్తాడని, అతడు చూపే గౌరవానికే తను పడిపోయానని రాణి చెప్పుకొచ్చింది. మగాడిగా ఆదిత్యలో తనకు నచ్చేది అతడు తన పట్ల చూపించే గౌరవమే అని రాణి ముఖర్జీ అంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.