శ్రీను వైట్ల ఒకప్పటి టాప్ డైరెక్టర్.. నీకోసం, ఆనందం, ఢీ, దూకుడు, బాద్ షా లాంటి హిట్ చిత్రాలను అందించిన ఈ దర్శకుడికి టైం కలిసి రాకపోవడం, కమర్షియల్ ఫార్ములా మూస కథలనుండి బయటకు రాకపోవడంతో వరుస పరాజయాలు వెంటాడాయి. మిస్టర్, బ్రూస్ లీ, ఆగడు లాంటి వరుస డిజాస్టర్లు రావడంతో స్టార్ హీరోలు సైడైపోయారు. అయితే ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ లాంటి వరుస హిట్లతో రవితేజకు మాస్ రాజా ఇమేజ్ ఇచ్చిన శ్రీను వైట్లపై మాస్ రాజా రవితేజ నమ్మకం ఉంచాడు. తనపై పెట్టిన నమ్మకాన్ని ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో విజయాన్ని అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు శ్రీనువైట్ల.
తాజాగా ఈ మూవీ టీజర్ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఈ మూడు పాత్రల్ని టీజర్లో హైలైట్ చేసారు దర్శకుడు శ్రీనువైట్ల. టీజర్ చాలా కొత్తగా.. సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. ‘మనం ఆపదలో ఉన్నపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. ముగింపు రాసుకున్న తర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అమెరికాలోని అందమైన లొకేషన్స్తో చాలా రిచ్గా ఉంది టీజర్.
రవితేజ సినిమాలు అంటే.. నాలుగు మాస్ డైలాగ్లు, రెండు పవర్ ఫుల్ సీన్స్, కామెడీ సన్నివేశాలు కామన్గా ఉంటాయి. ఇక శ్రీను వైట్ల, రవితేజ కాంబో మూవీ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అయితే ‘అక్బర్ అమర్ ఆంటోని’ చిత్ర టీజర్లో వీరి శైలికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా రవితేజ మూడు డిఫరెండ్ షేడ్స్లో చూపించాడు దర్శకుడు. మాస్ రాజాను క్లాస్ లుక్లో చూపించారు. అయితే ఇది టీజర్ వరకేనా? లేక సినిమా మొత్తం ఇలానే చూపిస్తారా అన్నది నవంబర్ 16 న థియేటర్స్లో చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు,త రుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎ స్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో కథల ఎంపికపై ప్రత్యేకత చూపిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అమర్ అక్బర్ ఆంటోనీ.
తాజాగా ఈ మూవీ టీజర్ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇందులో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఈ మూడు పాత్రల్ని టీజర్లో హైలైట్ చేసారు దర్శకుడు శ్రీనువైట్ల. టీజర్ చాలా కొత్తగా.. సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. ‘మనం ఆపదలో ఉన్నపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం.. ముగింపు రాసుకున్న తర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అమెరికాలోని అందమైన లొకేషన్స్తో చాలా రిచ్గా ఉంది టీజర్.
రవితేజ సినిమాలు అంటే.. నాలుగు మాస్ డైలాగ్లు, రెండు పవర్ ఫుల్ సీన్స్, కామెడీ సన్నివేశాలు కామన్గా ఉంటాయి. ఇక శ్రీను వైట్ల, రవితేజ కాంబో మూవీ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అయితే ‘అక్బర్ అమర్ ఆంటోని’ చిత్ర టీజర్లో వీరి శైలికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా రవితేజ మూడు డిఫరెండ్ షేడ్స్లో చూపించాడు దర్శకుడు. మాస్ రాజాను క్లాస్ లుక్లో చూపించారు. అయితే ఇది టీజర్ వరకేనా? లేక సినిమా మొత్తం ఇలానే చూపిస్తారా అన్నది నవంబర్ 16 న థియేటర్స్లో చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు,త రుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎ స్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో కథల ఎంపికపై ప్రత్యేకత చూపిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అమర్ అక్బర్ ఆంటోనీ.