యాప్నగరం

ఆడపిల్ల కోసం ఎంతమందినైనా కంటా: యాంకర్ అనసూయ

‘ప్రతిసారి ఎవరైనా మీకు ఎంతమంది పిల్లలు అని నన్ను అడిగితే ఇద్దరు అబ్బాయిలు అని చెప్పడానికి ఏదోలా అనిపిస్తుంది’.. ఈ మాటలన్నది ఎవరో కాదు యాంకర్ అనసూయ. ఆమెకు ఇద్దరూ మగపిల్లలే పుట్టడం వల్ల ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారామే.

Samayam Telugu 15 May 2019, 9:28 am
అమ్మతనంలోని కమ్మదనం ఆస్వాదిస్తూ.. ఆ మధురానుభూతిని ఎన్నిసార్లైనా పొందేందుకు నేను సిద్ధమే అంటోంది యాంకర్ అనసూయ భరద్వాజ్. అమ్మ అయితే అందం కరిగిపోతుందనే ఆందోళన ఈ గ్లామర్ ప్రపంచంలో చాలా ఎక్కువే. అయితే ‘అమ్మతనం ఓ మధురమైన అనుభూతి. దేవుడు ఇచ్చిన వరం. దాని విలువ ఏంటో పిల్లలు లేని వాళ్లకే తెలుస్తుంది. అందుకే నాకు ఎన్నిసార్లు పిల్లల్ని కనాలనిపిస్తే అన్నిసార్లు పిల్లల్ని కంటా.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తా’ అని అంటోంది అనసూయ.
Samayam Telugu Anasuya


ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అమ్మతనం’పై అద్భుతమైన సందేశం ఇచ్చింది అనసూయ. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతిసారి ఎవరైనా మీకు ఎంతమంది పిల్లలు అని నన్ను అడిగితే ఇద్దరు అబ్బాయిలు అని చెప్పడానికి ఏదోలా అనిపిస్తుంది’ అని అన్నారు.

ఆడపిల్లను కోసం ఎంతమందినైనా కంటా..
‘మొదటిసారి నాకు అబ్బాయి కావాలనే అనుకున్నాను. మేం ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో అబ్బాయి పుడితే బాగుండు అనిపించేది. అయితే నాకు రెండోసారి అమ్మాయి పుట్టాలని కోరుకున్నా. కాని మళ్లీ అబ్బాయి పుట్టాడు. నాకు వీలు కుదిరి పిల్లల్ని కనడానికి రెడీ అనిపించినప్పుడు తప్పకుండా అమ్మాయిని కనేందుకు ట్రై చేస్తా. అయితే అది మూడోసారా? నాలుగోసారా? అని చెప్పలేను. అమ్మతనం అనేది దేవుడు ఇచ్చిన దీవెన. అమ్మకావడమే వరం. ఆ వరం ఏంటో అది లేనివాళ్లకే తెలుస్తుంది. అందుకే నేను ఎన్నిసార్లు కనాలనిపిస్తే అన్నిసార్లు పిల్లల్ని కంటా. మా అమ్మమ్మకి ఎనిమిది మంది పిల్లలు. సో ఇళ్లంతా కళకళలాడుతూ ఉంటుంది అంతమంది పిల్లలు ఉంటే. నాకు చాలా ఇష్టం పిల్లల్ని కనడమంటే’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.