యాప్నగరం

నేను చనిపోతే నీకు పెళ్లెవరు చేస్తారు?...రేణూదేశాయ్

పవన్‌తో విడిపోయి, బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

TNN 15 Oct 2017, 9:35 am
పవన్‌తో విడిపోయి, బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవలే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన తర్వాత జరిగిన ఒక్కో సంఘటనను ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతకాలం క్రితం తాను తీవ్రమైన జ్వరం, 'ఆర్థో ఇమ్యూన్ కండిషన్' బారిన పడినప్పుడు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Samayam Telugu renu desai reveal her experience after illness news
నేను చనిపోతే నీకు పెళ్లెవరు చేస్తారు?...రేణూదేశాయ్


చికిత్సలో భాగంగా మాత్రలు వేసుకోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లానని, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్య లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ పేర్కొన్నారు. తనకు మెలకువ వచ్చే సరికి ‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌' అని ఒకటే ఏడుపు లంకించుకుందట. దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చారట. అమ్మను త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడిని ప్రార్థించమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.