యాప్నగరం

Ram Charan: మాల్దీవులు నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్, ఉపాసన.. చెర్రీకి ఎదురెల్లి స్వాగతం చెప్పిన రైమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఆయన భార్య ఉపాసన (Upasana) మాల్దీవులు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన ఈ మెగా దంపతులు.. తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వారి పెంపుడు శునకం రైమ్ స్వాగతం పలికింది.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 12 Apr 2023, 4:09 pm

ప్రధానాంశాలు:

  • రామ్ చరణ్‌ను చూసి పరుగు పెట్టిన రైమ్
  • దాన్ని ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడిన చెర్రీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ram Charan Rhyme
ఎయిర్‌పోర్టులో రామ్ చరణ్‌కు రైమ్ స్వాగతం
మాల్దీవులు విహారయాత్రకు వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఈ స్టార్ కపుల్‌కి వారి పెంపుడు శునకం రైమ్ స్వాగతం పలికింది. చెర్రీ మిత్రులు ఎయిర్‌పోర్టులో రైమ్‌ను కింద వదలగానే ఎదురుగా వస్తున్న రామ్ చరణ్ వద్దకు పరుగు పరుగున వెళ్లింది. తన బాస్‌ను చూసిన ఆనందంలో చలాకీగా తోకజాడిస్తూ అల్లరి చేసింది. వెంటనే దాన్ని ఎత్తుకుని ముద్దాడారు రామ్ చరణ్. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రెంచ్ బార్బెట్ బ్రీడ్ అయిన రైమ్.. రామ్ చరణ్, ఉపాసనలకు ఎంతో ఇష్టమైన శునకం. దాన్ని చరణ్ కన్నకూతురిలా చూసుకుంటారు. రైమ్‌‌కు ‘ఆల్వేజ్ రైమ్’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్‌కు 59 వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉండ‌టం విశేషం. రామ్ చరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు ఈ అకౌంట్‌లో రైమ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. రామ్ చరణ్, రాజమౌళితో కలిసి విమానంలో కూడా ప్రయాణం చేసింది ఈ రైమ్.
View this post on Instagram A post shared by Rhyme (@alwaysrhyme)

నిజానికి రైమ్‌ లేకుండా రామ్ చరణ్, ఉపాసన అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్‌ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్‌ ఉండాల్సిందే. RRR ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్‌ సందడి చేసింది. RRR ప్రమోష‌న్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండి సినిమాను ప్రమోట్ చేశారు. అక్కడి నుంచి ఉత్తరాది అంతా సినిమా ప్రమోష‌న్స్‌తో బిజీగా ఉండిపోయారు. ఈ సమయంలో రైమ్‌ను ఢిల్లీలోనే వదిలిపెట్టారు.
View this post on Instagram A post shared by Rhyme (@alwaysrhyme)

ప్రమోషన్స్ టూర్ నుంచి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు రామ్‌ చరణ్‌‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్‌ ఎదురెళ్లి వెల్‌క‌మ్ చెప్పి త‌న‌ ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. రామ్‌ - రైమ్‌ ఇద్దరి మధ్య బాండింగ్‌ అభిమానులకు, ఫాలోవ‌ర్స్‌కు స్పెష‌ల్‌గా అనిపించింది. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అదే సీన్ రిపీట్ అయ్యింది.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్ అనంతరమే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. మళ్లీ త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.