యాప్నగరం

RX 100 దర్శకుడు అజయ్‌ భూపతికి కరోనా పాజిటివ్

తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా అజయ్ భూపతి ట్వీట్ చేశారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.

Samayam Telugu 13 Aug 2020, 9:00 am
రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా సోకింది. ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు అజయ్ భూపతి. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ‘వచ్చేసింది’ అంటూ అజయ్ ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తాను త్వరగా కోలుకుంటానని, ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇకపోతే అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా 'మహా సముద్రం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి సైతం నటిస్తున్నారు.
Samayam Telugu అజయ్ భూపతి
ajay bhupathi


కరోనా వైరస్ ప్రభావం ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద బాగా పడింది. ఇప్పటికీ సినిమా షూటింగులు నిలిచిపోయాయి. హీరోలు, దర్శకులు, అలాగే సినీ వర్గాలకు చెందిన వారంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభమయ్యాయి. దీంతో సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డైరెక్టర్ తేజా కూడా కరోనా బారిన పడ్డారు.
Read More: కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి.. కానీ!
ప్రస్తుతం రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చింది. ఆయనకే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా నెగటివ్‌ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. త్వరలోనే ప్లాస్మా కూడా డొనేట్ చేస్తానని తెలిపారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి... తెలంగాణ పోలీసులతో కలిసి ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.