యాప్నగరం

కేరళకు సాయం.. వేలానికి ‘ఆర్ఎక్స్100’ బైక్!

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అండగా నిలవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, స్వచ్ఛంద సంస్థల నుంచి కార్పోరేట్ కంపెనీల వరకు అందరూ కేరళకు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.

Samayam Telugu 21 Aug 2018, 3:14 pm
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అండగా నిలవాల్సిన అవసరం మనపై ఎంతైనా ఉంది. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, స్వచ్ఛంద సంస్థల నుంచి కార్పోరేట్ కంపెనీల వరకు అందరూ కేరళకు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు స్టార్ హీరోలు భారీ మొత్తంలో సాయాన్ని అందజేశారు. చిరంజీవి కుటుంబం, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ ఇప్పటికే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేశారు. తాజాగా ‘ఆర్ఎక్స్100’ సినిమా యూనిట్ కూడా ముందుకొచ్చింది.
Samayam Telugu RX-100


కేరళ రిలీఫ్ ఫండ్‌కు నిధులు సమకూర్చడంలో భాగంగా తమ సినిమాలో వాడిన ఆర్ఎక్స్100 బైక్‌ను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిత్ర హీరో కార్తికేయ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. కేరళకు సాయం అందించడానికి తమ బైక్‌ను వేలం వేస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను rx100auction@gmail.comకు మెయిల్ చేయొచ్చని, లేదంటే వాట్సాప్ నంబర్ 9100445588కు పంపొచ్చని వెల్లడించారు. కనీస బిడ్ రూ.50,000ని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.