యాప్నగరం

స్పృహ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. కుటుంబ సభ్యులతో ఆ ఒక్క మాట! వీడియో వైరల్

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన స్పృహ లోకి వచ్చినట్లుగా తెలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 11 Sep 2021, 6:57 pm
మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురికావడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. నిన్న (శుక్రవారం) హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడ్డారు సాయి తేజ్. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అపోలో వైద్యుల సమక్షంలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రాణాపాయం లేద‌ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యులు తాజాగా మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
Samayam Telugu స్పృహ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. కుటుంబ సభ్యులతో ఆ ఒక్క మాట!
Sai Dharam Tej


ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరానికి అంతర్గత గాయాలు ఏవీ కాలేదని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అన్ని ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని, ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటి సమస్యలు కూడా లేవని తెలిపారు. చికిత్సకు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. కాగా కొద్దిసేపటి క్రితం స్పృహ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క మాట అన్నట్లుగా సమాచారం.
Sai Dharam Tej Accident: ఇలాంటి టైమ్‌లో రాజకీయాలు చేయొద్దు.. నరేష్ వ్యాఖ్యలపై నట్టి కుమార్ కామెంట్స్
ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సాయి ధరమ్ తేజ్ దగ్గరకి కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు అనుమతి ఇవ్వడం లేదని, కేవలం వీడియో కాల్‌లో ఆయన్ను చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో ‘నొప్పిగా ఉంది’ అని ఒకే ఒక్క మాట మాత్రమే సాయి తేజ్ అన్నారని సమాచారం. ఆసుపత్రిలో ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ సినీ లోకం కోరుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.