మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘విరూపాక్ష’ మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అయితే గతంలో తనకు యాక్సిడెంట్ (Accident) జరిగిన తర్వాత కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ (Abdul Farhan) అనే యువకుడి గురించి తాజా ఇంటర్వూలో మాట్లాడాడు తేజ్. అతనికి ఏమైనా డబ్బులు సాయం చేశారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘అలాంటిదేం చేయలేదు కానీ నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది. నీకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా నాకు కాల్ చెయ్ అని చెప్పాం. ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి అతని మానవత్వానికి వెలకట్టడం నాకు నచ్చదు’ అన్నాడు. అలాగే తనను కలిసినట్లుగా కూడా ఇదే ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. కానీ అబ్దుల్ ఫర్హాన్ ‘సమయం తెలుగు’తో మాట్లాడుతూ.. అవన్నీ అబద్ధాలే (Fake News) అని తేల్చేశాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల తను ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వివాదంపై తాజాగా నోట్ షేర్ చేశాడు తేజు. సాయిధరమ్ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోతో పాటు ఈ వివాదానికి వివరణ ఇస్తూ నోట్ జత చేశాడు. ‘నాతో పాటు నా టీమ్పై అసత్య ప్రచారం జరుగుతోందని ఈ రోజు నా దృష్టికి వచ్చింది. నేను లేదా నా టీమ్.. అబ్దుల్ ఫర్హాన్కు డబ్బు రూపంలో సాయం చేసినట్లుగా నేను ఎక్కడా చెప్పలేదన్న విషయం ఇక్కడ ట్యాగ్ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. నాకు, నా ఫ్యామిలీకి అతను చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను.. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అతని దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఏ సాయం అవసరమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నా మేనేజర్ శరణ్ తనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఈ విషయానికి సంబంధించి ఇదే నా చివరి వివరణ’ అంటూ నోట్లో పేర్కొన్నాడు.
అయితే, అబ్దుల్ ఫర్హాన్ చెప్పిన వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ తనను సంప్రదించలేదని, ఎటువంటి సాయం చేయలేదు కదా ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదని తాజా వీడియోలో క్లియర్గా చెప్పాడు. కానీ తనకు డబ్బులతో పాటు వెహికల్ ఇచ్చారనే ఫేక్ న్యూస్ వల్ల పనిచేసే చోట ఇబ్బందులు తలెత్తి జాబ్ మానేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం అమెజాన్లో డ్రైవర్గా పనిచేస్తు్న్నానని.. ఇప్పటికైనా కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతోనే మెగా ఫ్యామిలీ డ్యామేజ్ కంట్రోల్కు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ తాను ఇంటర్వ్యూలో అబ్దుల్ గురించి మాట్లాడిన వీడియోను షార్ట్గా ఎడిట్ చేసి, దాంతో పాటు ఈ నోట్ కూడా షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో మెగా ఫ్యామిలీ అతనికి సాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయంటే.. చేసి ఉండవచ్చంటూనే ఫోన్ నంబర్ ఇవ్వడంతో పాటు కలిసినట్లు చెప్పడంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, అబ్దుల్ ఫర్హాన్ చెప్పిన వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ తనను సంప్రదించలేదని, ఎటువంటి సాయం చేయలేదు కదా ఫోన్ నంబర్ కూడా ఇవ్వలేదని తాజా వీడియోలో క్లియర్గా చెప్పాడు. కానీ తనకు డబ్బులతో పాటు వెహికల్ ఇచ్చారనే ఫేక్ న్యూస్ వల్ల పనిచేసే చోట ఇబ్బందులు తలెత్తి జాబ్ మానేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం అమెజాన్లో డ్రైవర్గా పనిచేస్తు్న్నానని.. ఇప్పటికైనా కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతోనే మెగా ఫ్యామిలీ డ్యామేజ్ కంట్రోల్కు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ తాను ఇంటర్వ్యూలో అబ్దుల్ గురించి మాట్లాడిన వీడియోను షార్ట్గా ఎడిట్ చేసి, దాంతో పాటు ఈ నోట్ కూడా షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో మెగా ఫ్యామిలీ అతనికి సాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయంటే.. చేసి ఉండవచ్చంటూనే ఫోన్ నంబర్ ఇవ్వడంతో పాటు కలిసినట్లు చెప్పడంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- Read latest Tollywood updates and Telugu News