యాప్నగరం

Allu Aravind: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ సీసీ టీవీ ఫుటేజ్.. కొన్ని గంటల్లోనే కోలుకుంటాడు: అల్లు అరవింద్ ప్రెస్ మీట్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో మెగా అభిమానులు ఆందోళనలో ఉన్నారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా బైక్ స్కిడ్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు సాయి ధరమ్ తేజ్.

Samayam Telugu 11 Sep 2021, 12:28 am
సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పటల్‌కి తరలించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పటల్‌కి చేరుకున్నారు. ఆయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్, చిరంజీవి సతీమణి సురేఖ, తదితరులు అపోలో హాస్పటల్‌కి చేరుకున్నారు.
Samayam Telugu సాయి ధరమ్ తేజ్
allu aravind on sai dharam tej accident


అయితే మీడియాలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి పుకార్లకు తావు ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ‘సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు.. కొన్ని గంటల్లోనే మామూలు పరిస్థితికి వస్తాడు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు.. డాక్టర్లతో నేను మాట్లాడాను.. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.. డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మిగిలిన వివరాలు తెలియజేస్తారని’ అన్నారు అల్లు అరవింద్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.