యాప్నగరం

Sai Dharam Tej: OTTలో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’?.. గేర్ మార్చిన సుప్రీమ్ హీరో!

‘చిత్రలహరి’, ‘సోలో బ్రతుకే సోబెటర్’ చిత్రాలతో హిట్ ట్రాక్ ఎక్కిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కేవలం 64 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది.

Samayam Telugu 3 Jun 2021, 1:15 pm
థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో సినిమా థియేటర్స్‌లో బొమ్మ పడే అవకాశం ఇప్పట్లో అయితే లేనట్టే. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు పదుల సంఖ్యలో వాయిదా పడ్డాయి. దీంతో దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఓటీటీ బాట పడుతున్నారు.
Samayam Telugu ఓటీటీలో రిపబ్లిక్ మూవీ
republic movie ott release


ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో చిన్న చిన్న చిత్రాలను మాత్రమే ఓటీటీలో విడుదల చేయగా.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలను సైతం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజాగా చిత్రం ‘రిపబ్లిక్’ జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

అయితే థియేటర్స్‌లో విడుదల చేసే పరిస్థితి ఇప్పట్లో లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ‘పే పర్ వ్యూ’ పద్దతిలో రిలీజ్ చేయడానికి ఆహా, జీ సంస్థలతో సంప్రదింపులు జరుగుపుతున్నారట. త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా రిపబ్లిక్ చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహించగా.. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించింది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.