యాప్నగరం

‘సోలో బ్రతుకే సో బెటర్’ సెన్సార్ పూర్తి.. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా రూపొందిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

Samayam Telugu 21 Oct 2020, 5:19 pm
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని పేర్కొన్నారు.
Samayam Telugu సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej

నిజానికి ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కాకపోతే, కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. సుమారు ఐదు నెలల విరామం తరవాత ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సింగిల్ షెడ్యూల్‌లో మిగిలిన భాగాన్ని, పాటలను చిత్రీకరించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘అమృత’ అనే సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకున్నాయి. ఇక టీజర్, ట్రైలర్ రావాల్సి ఉంది.

‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్ మూవీ తరవాత సాయి తేజ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే సినిమాను రూపొందించినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకటర్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.