యాప్నగరం

‘కణం’ ట్రైలర్.. సాయి పల్లవి మార్క్ స్టోరీ!

సాయి పల్లవి నటిస్తోన్న ద్విభాషా చిత్రం కణం ఆకట్టుకునే కథాంశంతో.. సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.

TNN 18 Nov 2017, 6:37 pm
ఫిదా సినిమాలో భానుమతిగా న‌టించిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ఆ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తర్వాత నానితో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ట్రైలర్‌తోనూ సాయి పల్లవి ఆకట్టుకొంది. ఈ మూవీ డిసెంబ‌ర్ 21న విడుద‌లకు ముస్తాబవుతోంది. యువ కథానాయకుడు నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది.
Samayam Telugu sai pallavi and naga shaurya starrer kanam trailer unveiled
‘కణం’ ట్రైలర్.. సాయి పల్లవి మార్క్ స్టోరీ!


‘కణం’ పేరిట చిత్రీకరిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళంలో ‘కరు’గా తెరకెక్కిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. సారీ అమ్మా, చేసింది తప్పే.. అలా ఏమీ వద్దమ్మా అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్‌లతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ మాటలతోపాటు కణం టైటిల్, ట్రైలర్‌ను బట్టి అబార్షన్ నేపథ్యంలో ఈ చిత్రంలో సాగుతుందని తెలుస్తోంది.

హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా కనిపించనుంది. తల్లీ కూతుళ్ల మధ్య సెంటిమెంట్ ఆకట్టకుంటుందని డైరెక్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ద్వారా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగేలా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.