అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలిసి తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నీ తిరిగేస్తున్నారు. ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలోని బోడకొండ జలపాతం వద్ద సందడి చేశారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో చక్కర్లు కొట్టారు. అయితే, ఇదంతా ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేలెండి. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. లాక్డౌన్ తరవాత గతనెల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.
తాజాగా ఆర్మూర్ సమీపంలోని నవసిద్ధుల గుట్ట వద్ద ‘లవ్ స్టోరీ’ చిత్రీకరణ జరిగింది. నాగచైతన్య, సాయి పల్లవిలపై కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో స్థానికలు తమ స్మార్ట్ ఫోన్లలో ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. నవసిద్ధుల గుట్టపై సాయి పల్లవి చేయి పట్టుకుని నాగ చైతన్య పరుగు పెడుతున్న సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం బయటికి వచ్చింది.
Also Read: ‘ద లస్ట్’ ట్రైలర్: ‘నగ్నం’ బ్యూటీ శ్రీ రాపాక మరో సెన్సేషన్.. పెద్దలకు మాత్రమే
ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. అందుకే ఈ చిత్ర షూటింగ్ అంతా తెలంగాణలోనే చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. కాగా, ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
తాజాగా ఆర్మూర్ సమీపంలోని నవసిద్ధుల గుట్ట వద్ద ‘లవ్ స్టోరీ’ చిత్రీకరణ జరిగింది. నాగచైతన్య, సాయి పల్లవిలపై కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో స్థానికలు తమ స్మార్ట్ ఫోన్లలో ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. నవసిద్ధుల గుట్టపై సాయి పల్లవి చేయి పట్టుకుని నాగ చైతన్య పరుగు పెడుతున్న సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం బయటికి వచ్చింది.
Also Read: ‘ద లస్ట్’ ట్రైలర్: ‘నగ్నం’ బ్యూటీ శ్రీ రాపాక మరో సెన్సేషన్.. పెద్దలకు మాత్రమే
ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. అందుకే ఈ చిత్ర షూటింగ్ అంతా తెలంగాణలోనే చేస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. కాగా, ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.