యాప్నగరం

రంగస్థలం కాంబో: మళ్లీ చెర్రీతో సమంత?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో సమంత మరోసారి సినిమాలో నటించబోతుందా? రంగస్థలం జోడి రిపీట్ కానుందా?

TNN 4 Mar 2018, 8:54 pm
రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన రంగస్థలం మార్చి 30న విడుదలకు సిద్ధం అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా.. చెర్రీ, సామ్ మరో సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌లో సమంత నటించనున్నట్లు సమాచారం.
Samayam Telugu samantha to star in ss rajamoulis multi starrer with ram charan and jr ntr
రంగస్థలం కాంబో: మళ్లీ చెర్రీతో సమంత?


ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నాలు ఆసక్తి చూపుతున్నారు. కానీ చెర్రీ సరసన సమంతనే ఫైనల్ చేశారనే వార్తలు తాజాగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే.. చెర్రీ, సామ్‌ను మరోసారి తెరపై చూసే అవకాశం అభిమానులకు కలగనుంది.

ప్రస్తుతం సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మహానటి సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో సమంత నటిస్తోంది. తమిళంలో విశాల్ సరసన ఇరుంబు థిరై అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ మూవీ ద్వారా పీఎస్ మిథరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.