సమంత, నాగ చైతన్య విడాకుల రూమర్లు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇద్దరి విడాకుల వ్యవహారం చివరి ఘట్టానికి చేరుకుందనే రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి. కానీ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా వాటిని ఖండించడం లేదు. కనీసం రియాక్ట్ అవ్వడం కూడా లేదు. వీరి మౌనం వల్ల సోషల్ మీడియాలో మరిన్ని కొత్త కొత్త అనుమానాలకు తెరలేపుతున్నారు. సమంత ఇప్పటికే వేరుగా ఉంటోందని, ముంబైకి షిఫ్ట్ అయిందనే టాక్ కూడా వచ్చింది. నాగ చైతన్య కూడా వీటిపై త్వరలోనే స్పందించాల్సిన సమయం వస్తుంది. తన లవ్ స్టోరీ ప్రమోషన్స్ సమయంలో ఎక్కడో ఓ చోట సమంతకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోక తప్పదు. అప్పుడు ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. కానీ సమంత మాత్రం ఇలా సైలెంట్గా ఉండటంతో విడాకుల విషయం మాత్రం అందరిలోనూ నానుతోంది. ఇలాంటి రూమర్లకు సమంత ఎప్పుడూ సెటైరికల్గా స్పందిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండటంతో పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.
ఇలా విడాకుల గురించి బయట పుకార్లు నడుస్తూ ఉంటే సమంత మాత్రం ఎంచక్కా ప్రయాణాలు చేస్తోంది. తన డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్తో కలిసి తిరుపతికి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక రకరకాల కొటేషన్లను సైతం కోట్ చేస్తోంది. నువ్ పాటించనిది ఎప్పుడూ కూడా ఇతరులకు చెప్పొద్దు అంటూ సమంత ఓ కొటేషన్ను షేర్ చేసింది. మొత్తానికి సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇలా విడాకుల గురించి బయట పుకార్లు నడుస్తూ ఉంటే సమంత మాత్రం ఎంచక్కా ప్రయాణాలు చేస్తోంది. తన డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్తో కలిసి తిరుపతికి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక రకరకాల కొటేషన్లను సైతం కోట్ చేస్తోంది. నువ్ పాటించనిది ఎప్పుడూ కూడా ఇతరులకు చెప్పొద్దు అంటూ సమంత ఓ కొటేషన్ను షేర్ చేసింది. మొత్తానికి సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.