యాప్నగరం

కరోనాను జయించిన చిరు హీరోయిన్.. ఇలా చేస్తే త్వరగా కోలుకోవచ్చు అంటూ అభిమానులకు సూచన

‘జై చిరంజీవ’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించిన సమీరా రెడ్డి కరోనా వైరస్ నుంచి కోలుకుంది. ఈ విషయం ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోలేదని చెప్పిన ఆమె.. అభిమానులకు పలు సూచనలు చేసింది.

Samayam Telugu 1 May 2021, 4:59 pm
రెండో దశలో కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన సమీరా రెడ్డి, ఆమె భర్త ఆక్షయ్ వార్దేతో పాటు పిల్లలకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె వైద్యుల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.
Samayam Telugu సమీరా రెడ్డి
Sameera Reddy


కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆమె స్వల్ప అనారోగ్యంతో ఉన్నానని పేర్కొంది. ఇందుకోసం యోగా, వాకింగ్ చేయడం ద్వారా మళ్లీ శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించింది. ‘‘నా కుటుంబం సురక్షితంగా ఉందని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మరోవైపు ప్రతీ ఒక్కరు పడుతున్న కష్టాలు చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. గత రెండు నెలలుగా ఫిట్‌సెన్ ఫ్రైడేని పాటించడం ఈ కఠిన సమయంలో నాకు ఎంతో ఉపయోగపడింది. నిజంగా పిల్లలకు, నాకు, అక్షయ్‌ ఒకేసారి కరోనాతో పోరాడాల్సి రావడం ఎంతో కష్టంగా అనిపించింది’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

‘‘నేను ఇంకా కొంత బలహీనంగానే ఉన్నాను. దాన్ని అధిగమించేందుకు యోగా, వాకింగ్ చేయడంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుంటున్నాను. ప్రతీ ఒక్కరు కూడా వ్యాయామం చేయండి. మన ఇంట్లో చేసే సింపుల్ వాకింగ్ కూడా మన స్టామినా పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వ్యతిరేక వార్తలను చూసి.. ఆగిపోవడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. హాయిగా నిద్రపోండి. ఇది ప్రతీ ఒక్కరు దృఢంగా ఉండాల్సిన సమయం. మీలో పాజిటివ్ శక్తిని పెంచుకోండి. జాగ్రత్తగా ఉండండి.. నాపై, నా కుటుంబంపై ప్రేమ చూపించిన మీ అందరికీ నేను రుణపడి ఉంటాను’’ అని ఆమె తెలిపింది.
View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.