యాప్నగరం

పుష్కరాలకు రమ్మని సంపూకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలవ్వబోతున్నాయి.

TNN 8 Aug 2016, 3:50 pm
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలవ్వబోతున్నాయి. ఆ పుష్కరాలకు రమ్మని ఏపీ ప్రభుత్వం ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. కాగా ఆ ఆహ్వానాలలో ఒకటి సంపూకి కూడా వచ్చింది. హృదయకాలేయం సినిమాతో సంపూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కొబ్బరి మట్ట సినిమా తీస్తున్నాడు. కాగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ఉబ్బితబ్బిబయిపోతున్నాడు సంపూ. తనకి రమ్మని పిలిచిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు సంపూ. ట్విట్టర్ ద్వారా తనకి వచ్చిన ఆహ్వానాన్ని పోస్టు చేసి.. తనను ఆహ్వానించిన ఏపీప్రభుత్వానికి నా నమస్సులు అని కృతజ్ఞతలు తెలియజేశారు.
Samayam Telugu sampoornesh babu got invitation from ap government
పుష్కరాలకు రమ్మని సంపూకి ఆహ్వానం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.