యాప్నగరం

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పూరీ హీరోయిన్!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా వాళ్లకు కర్ణాటకలో ఎనలేని డిమాండ్ వచ్చింది.

Samayam Telugu 5 May 2018, 3:58 pm
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమా వాళ్లకు కర్ణాటకలో ఎనలేని డిమాండ్ వచ్చింది. వీరి చేత ప్రచారం చేయించుకోవడానికి పార్టీలు పోటీ పడుతున్నాయి. తమకు టచ్లో ఉన్న వారిని పిలిపించుకుని ప్రచారాలు చేయించుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో అటు మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే జేడీఎస్ వాళ్లు కన్నడ ప్రముఖ హీరోయిన్ పూజాగాంధీ చేత ప్రచారం చేయించుకుంటున్నారు. కుమారస్వామిని మళ్లీ సీఎంగా చేయాలని అంటూ పూజాగాంధీ ప్రచారం చేస్తోంది.
Samayam Telugu sanjana


ఇక ఇతర సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరింది సంజన.‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలుగా నటించి తెలుగు వారికి సుపరిచితురాలీమె. ఆ సినిమాలోనే గాక మళ్లీ కూడా కొన్ని తెలుగు సినిమాల్లో చేసింది. సంజన కన్నడలో ఒక దశలో స్టార్ గా వెలుగొందింది. తన గ్లామర్ షోతో ఈమె ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆ గ్లామర్‌ను ఓట్ల పంట పండించడానికి ఉపయోగించుకుంటోంది ఈ నటీమణి. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని సంజన ప్రకటించింది. కుమారస్వామిని మళ్లీ సీఎం చేమని పూజాగాంధీ పిలుపునిస్తుంటే, సిద్ధరామయ్యను మళ్లీ సీఎంగా చేయాలని సంజన అంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.