యాప్నగరం

Ala Vaikunthapurramloo: మహేష్, బన్నీ సంక్రాంతి సినిమాల కలెక్షన్లు ముందే వచ్చేశాయ్!

Thammareddy Bharadwaja: ఈ ఏడాది సంక్రాంతి పందెంకోళ్లుగా బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా.. రెండోది బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. ఈ రెండు చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కాబోతుండటంతో విడుదలకు ముందే బాక్సాఫీస్ వార్ మొదలైంది.

Samayam Telugu 16 Dec 2019, 7:14 pm
Thammareddy Bharadwaja: ఈ ఏడాది సంక్రాంతి పందెంకోళ్లుగా బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా.. రెండోది బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. ఈ రెండు చిత్రాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కాబోతుండటంతో విడుదలకు ముందే బాక్సాఫీస్ వార్ మొదలైంది.
Samayam Telugu sankashti 2019 movies thamma reddy bharadwaj predicts collections of ala vaikuthapurramloo and sarileru neekevvaru
Ala Vaikunthapurramloo: మహేష్, బన్నీ సంక్రాంతి సినిమాల కలెక్షన్లు ముందే వచ్చేశాయ్!


జనవరి 12న సరిలేరు నీకెవ్వరు

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ దర్శకుడిగా మారిన అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్‌ను మేజర్ అజయ్ క్రిష్ణగా చూపించబోతున్నారు.

భారీ తారగణం.. బీభత్సమైన హైప్

ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తరవాత ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తుండగా.. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇన్ని భారీ హంగులతో.. భారీ బడ్జెట్‌తో సంక్రాంతి కానుకగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘అల వైకుంఠపురములో’ రిజల్ట్‌పై ధీమా

మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-బన్నీ కాంబోలో ఈ మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ‘అల వైకుంఠపురములో’ చిత్ర రిజల్ట్‌పై ధీమాగా ఉంది చిత్ర యూనిట్.

See Photo Story: నారింజ సొగసు నీది.. ఊరించే వయసు మాది!

సంక్రాంతి పందెంకోళ్లు మధ్య టఫ్ ఫైట్

ఇదిలా ఉంటే.. జనవరి 11 మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, జనవరి 12 అల వైకుంఠపురములో చిత్రాలు విడుదల కానుండటంతో పొంగల్ వార్ రంజుగామారిన సందర్భంగా విడుదలకు ముందే బాక్సాఫీస్ లెక్కలు కడుతున్నారు ప్రముఖ సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

See Photo Story: రౌడీ విజయ్ పారిస్ గళ్‌... బాబోయ్ గ్లామర్ ఆఫ్ బ్రెజిల్!

రూ. 150 కోట్లు పక్కా.. తొలి మూడు రోజుల్లోనే!

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు పెద్ద సినిమాలు బరిలో ఉండటం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయమే అంటున్నారు తమ్మారెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ఈ రెండు సినిమాలు కూడా విడుదలైన రెండు మూడు రోజుల వ్యవధిలోనే 100-150 కోట్లను ఈజీగా వసూలు చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ థియేటర్స్‌లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలను రిలీజ్ చేస్తారు.

సినిమా బాగుంటే.. ఈజీగా రూ. 200 కోట్లు

ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే థియేటర్స్ ప్లాబ్లమ్స్ వచ్చేవి. వేరే వేరు రోజులు కాబట్టి సమస్య ఉండదు. ఈ రెండు సినిమాలకు మంచి హైప్ ఉండటంతో రెండు రోజుల్లో సినిమా ఎలా ఉన్నా.. వంద నుండి నూట యాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తాయి. ఒకవేళ సినిమాలు బాగుంటే రూ. 200 కోట్లు ఈజీగా దాటేస్తుంది.

See Photo Story: బ్లాక్ ఈజ్ లవ్.. ప్లీజ్ సండే మళ్లీ రావా!

ఈ సినిమాల్లో దమ్ము ఉంటే.. రూ. 400 కోట్లు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు

ఈ రెండు సినిమాలు ఈజీగా రూ.150 కోట్లును రాబట్టవచ్చు. ఆపైన ఎంత సాధిస్తుందన్నది సినిమాలో ఉన్న దమ్ముని బట్టి తెలుస్తోంది. సినిమాలో దమ్ము ఉంటే.. రూ.300 కోట్లు వెళ్తుందా? లేక రూ. 400 కోట్లు వెళ్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ సినిమాలో దమ్ము లేకపోతే రూ. 150 కోట్లు దగ్గరే ఆగిపోతుంది తప్ప అంతకంటే తక్కువ అయితే మాత్రం కలెక్షన్లు రావు. ఈసారి రూ. 150 కోట్ల గ్రాస్‌ని ఈజీగా టచ్ చేస్తుంది. సినిమా బాగుండి హిట్ టాక్ వస్తే.. రూ. 150 కోట్ల షేర్ కూడా కావచ్చు’ అంటూ ఈ సంక్రాంతి సినిమాలు విడుదలకు ముందే బాక్సాఫీస్ లెక్కల్ని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.

గత సంక్రాంతి సినిమాల రిజల్ట్..

గత సంక్రాంతికి జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్‌తో మొదలైన ఈ సినీ పండుగ.. వరుసగా జనవరి 10న రజినీకాంత్ ‘పేట’.. 11న రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’.. 12న వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీ ‘F2’లతో ముగిసింది. వీటిలో ‘F2’ చిత్రం ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ చిత్రాల లిస్ట్‌లో చేరగా.. రజినీకాంత్ ‘పేట’ చిత్రం యావరేజ్ అయ్యింది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి ముందే సినిమా సందడి మొదలైంది. ఇప్పటికే ‘వెంకీమామ’ చిత్రం విడుదలై హిట్ టాక్ సాంధించగా.. బాలయ్య ‘రూలర్’, సాయి తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వచ్చే శుక్రవారానికి రెడీగా ఉన్నాయి. ఇక సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు రేస్‌లో ఉన్నాయి. మరి ఈ సంక్రాంతి పందెంలో నిలిచే బాక్సాఫీస్ పుంజు ఏదో త్వరలో తేలిపోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.