యాప్నగరం

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్నుమూత

ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి టాలీవుడ్ స్టార్‌ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ డ్యాన్స్‌ డైరెక్టర్‌ శ్రీను మాస్టర్‌ (82) చెన్నైలో గుండెపోటుతో మరణించారు.

Samayam Telugu 13 Oct 2019, 2:06 pm
1700లకు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫీ అందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ శ్రీను మాస్టర్‌ (82) గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలోని ఆయన స్వగృహంలో మరిణించినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1970లలో కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి శ్రీను మాస్టర్‌ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్ బాబు, కమల్‌ హాసన్‌ లాంటి స్టార్‌ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
Samayam Telugu Srinu Master
సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ శ్రీను మాస్టర్‌

Also Read: దుమ్ములేపుతున్న విజయ్‌.. మూడు గంటల్లోపే కోటి వ్యూస్‌

ఈ జనరేషన్‌ నటీనటులుకు కూడా ఆయన సుపరిచితుడే. క్లాసిక్స్‌గా నిలిచిపోయిన ఎన్నో చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన శ్రీను మాస్టర్.. స్వర్ణకమలం, శ్రీరామ రాజ్యం, రాధాగోపాలం లాంటి చిత్రాలకు గానూ నంది అవార్డను సైతం అందుకున్నారు. లెజెండరీ కొరియోగ్రాఫర్‌ హీరా లాల్‌ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీను మాస్టర్ స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: సంక్రాంతికి స్టార్‌వార్‌.. నిలిచేదెవరూ..? గెలిచేదెవరూ..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.