యాప్నగరం

సినీ జర్నలిస్ట్ కన్నుమూత.. కుటుంబానికి అండగా ఉంటానన్న చిరంజీవి

ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూశారు. చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Samayam Telugu 11 Feb 2020, 2:55 pm
సీనియర్ సినిమా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
Samayam Telugu pasupuleti ramarao
పసుపులేటి రామారావు


‘‘రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారరని, నడవలేకపోతున్నారని తెలిసి సన్‌షైన్ హాస్పిటల్ డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. తన అక్కకు బాగోలదేని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకు అంతే అభిమానం. లేకలేక పుట్టిన తన కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా కళ్యాణ్ నాగ చిరంజీవి అని పెట్టాడు. నీతికి నిజాయతీకి నిబద్ధతకూ మరో రూపంలా చూస్తుంటాను. అతనిక కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండగా ఉంటాను. వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు.

READ ALSO: రానాను గెలికిన నెటిజన్.. దగ్గుబాటి వారసుడు ఊరుకుంటాడా!

చిరంజీవితో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ‘సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. నాకు తెలిసిన కొద్ది మంది జర్నలిస్ట్‌లో రామారావు బాగా దగ్గర వ్యక్తి. ఆయనతో నా సంభాషణలన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అని వరుణ్ తేజ్ తెలిపారు. ‘‘ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని నాని సంతాపం తెలిపారు. వీరితో పాటు కళ్యాణ్‌రామ్, హరీశ్ శంకర్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.