యాప్నగరం

సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఇక లేరు

సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత కో ప్రొడ్యూసర్‌గా, దర్శకుడిగా మారిన సీనియర్...

Samayam Telugu 17 Jan 2017, 8:46 pm
సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి ఉయ్యూరు ఇక లేరు. జగదేకవీరుడు, అమ్మదొంగ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ సాగర్‌కి సోదరుడైన శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే యాంకర్ రష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన చారుశీల మూవీతో దర్శకుడిగా మారిన శ్రీనివాస్ రెడ్డి గతంలో కొన్ని చిత్రాలకి సహా నిర్మాతగానూ వ్యవహరించారు.
Samayam Telugu senior cinematographer srinivas reddy passed away
సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఇక లేరు


గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రెడ్డి మంగళవారం చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతిచెందారు. శ్రీనివాస్ రెడ్డికి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. రేపు హైదరాబాద్‌లోనే శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం. శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తంచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.