దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) పేరు చెప్పగానే వెంటనే ‘రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల (Yamaleela), శుభలగ్నం, ఘటోత్కచుడు’ సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇంకాస్త యంగ్ జనరేషన్కు అయితే ‘పెళ్లాం ఊరెళ్తే’ సినిమా గుర్తొస్తుంది. ఆయన తీసిన చిత్రాల్లో ఆరోగ్యకరమైన హాస్యమే తప్ప అశ్లీలతకు అస్సలు తావుండదు. ఆహ్లాదకరమైన పాటలతో మాయాచేస్తూ, తేలికైన మాటలతో గుండె బరువెక్కించగలరు. మొత్తానికి ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు అలరించడమే లక్ష్యంగా సినిమాలను రూపొందించారు కృష్ణారెడ్డి. కానీ ట్రెండ్ మారడంతో ఆయన చివరి చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఆరేడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ‘ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు’ (Organic Mama - Hybrid Alludu ) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తు్న్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఇంటర్వూలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad ) యాక్టింగ్పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణారెడ్డి ఎన్ని సినిమాలు తీసినా కమెడియన్ అలీని (Ali) హీరోగా పరిచయం చేసిన ‘యమలీల’ ప్రత్యేకం. ఈ ప్రయోగాత్మక చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే రాజేంద్ర ప్రసాద్తో తలెత్తిన విభేదాలను కృష్ణారెడ్డి చాలెంజ్గా తీసుకున్నారని, ఎవరినైనా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టి చూపిస్తాననే అలీ హీరోగా సినిమా తీశారనే రూమర్స్కు ఆయన క్లారిటీ ఇచ్చారు.
‘రాజేంద్ర ప్రసాద్తో కాంట్రవర్సీ రావడం అనేది కరెక్ట కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన మమ్మల్ని చాలా ప్రేమించారు. ఇష్టపడ్డారు. సరే, తర్వాతి కాలంలో చాలా వరకు సినిమాలు చేయలేదు. ఇవన్నీ వేరే విషయాలు. అయితే యమలీల కథకు ఎగ్జాట్గా అలీ లాంటి వ్యక్తే కావాలి. రాజేంద్ర ప్రసాద్ అయితే నటిస్తారు. కానీ అలీ అయితే జీవిస్తాడు. రెండింటికీ తేడా ఉంది. నటించడం వేరు. జీవించడం వేరు. అలీ స్వతహాగా ఆ క్యారెక్టర్ తగ్గట్లు అమాయకంగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా యమలీల చిత్ర కథను ఒకసారి గుర్తుచేసిన కృష్ణారెడ్డి.. దీనికి అలీ మాత్రమే సూట్ అవుతాడని చెప్పారు. అదేగాక యమలీలలో నిజానికి అలీ పక్కన సౌందర్య నటించాల్సింది. కానీ ఆమె అలీతో చేయనని తప్పుకుందని తెలిపారు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ అలీతో నటించిందని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం అమ్ము క్రియేషన్స్ బ్యానర్పై కోనేరు కల్పన నిర్మించిన ‘ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు’ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, అనన్య జంటగా నటించారు.
‘రాజేంద్ర ప్రసాద్తో కాంట్రవర్సీ రావడం అనేది కరెక్ట కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన మమ్మల్ని చాలా ప్రేమించారు. ఇష్టపడ్డారు. సరే, తర్వాతి కాలంలో చాలా వరకు సినిమాలు చేయలేదు. ఇవన్నీ వేరే విషయాలు. అయితే యమలీల కథకు ఎగ్జాట్గా అలీ లాంటి వ్యక్తే కావాలి. రాజేంద్ర ప్రసాద్ అయితే నటిస్తారు. కానీ అలీ అయితే జీవిస్తాడు. రెండింటికీ తేడా ఉంది. నటించడం వేరు. జీవించడం వేరు. అలీ స్వతహాగా ఆ క్యారెక్టర్ తగ్గట్లు అమాయకంగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా యమలీల చిత్ర కథను ఒకసారి గుర్తుచేసిన కృష్ణారెడ్డి.. దీనికి అలీ మాత్రమే సూట్ అవుతాడని చెప్పారు. అదేగాక యమలీలలో నిజానికి అలీ పక్కన సౌందర్య నటించాల్సింది. కానీ ఆమె అలీతో చేయనని తప్పుకుందని తెలిపారు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ అలీతో నటించిందని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం అమ్ము క్రియేషన్స్ బ్యానర్పై కోనేరు కల్పన నిర్మించిన ‘ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు’ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, అనన్య జంటగా నటించారు.
- Read Latest Tollywood Updates and Telugu News