యాప్నగరం

ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదం

Film Maker Rajendra Prasad Passed Away: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 19 Aug 2022, 8:03 pm
ప్రముఖ సినిమాటోగ్రాఫర్.. రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు కన్నుమూశారు. సీరియర్ దర్శకులు చంద్ర సిద్ధార్థ (ఆ నలుగురు ఫేమ్) సోదరుడే రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా దర్శకుడిగానూ.. నిర్మాతగానూ పనిచేశారు.
Samayam Telugu cinematographer rajendra prasad dies
సినిమాటోగ్రాఫర్‌ రాజేంద్రప్రసాద్


రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'నిరంతరం' సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా సేవలు అందించారు. బాలీవుడ్‌లో సైతం అనేక చిత్రాలకు పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.