యాప్నగరం

మహేశ్ లేటెస్ట్ సినిమాకు సీక్వెల్?!

కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ గా నిలిచిన ఈ సినిమాలో మహేశ్

Samayam Telugu 27 Jul 2018, 3:39 pm
ఇటీవలే వచ్చిన మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’కు సీక్వెల్ రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ గా నిలిచిన ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వరకూ హీరోలు ముఖ్యమంత్రి పాత్రల్లో నటించిన సినిమాలతో ‘భరత్ అనే నేను’కు కొంత పోలిక వచ్చినా, ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్టుగా దీని రూపకర్తలు ప్రకటించారు.
Samayam Telugu ban2


‘శ్రీమంతుడు’తో హిట్ కొట్టిన కొరటాల శివ, మహేశ్ బాబుల కాంబినేషన్ ‘భరత్..’తో మరో హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అనే మాట వినిపిస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమా మహేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి, దుష్టుల భరతం పట్టడంతో ముగుస్తుంది. పాలనాపరంగా కొన్ని మార్పులు కూడా చేస్తాడు హీరో.

ఇప్పుడు సీక్వెల్ గనుక తీస్తే మహేశ్ ముఖ్యమంత్రిగా చేసే మార్పులను, ఎదుర్కొనే సవాళ్లను సినిమాగా చూపవచ్చు. ఈ మేరకు కథా,కథనాలు సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ బాబు ‘భరత్ అనే నేను..’ అంటూ మరోసారి గర్జించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీక్వెల్ ఊహాగానాలను కొరటాల శివ అండ్ టీమ్ ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది. భరత్ కు సీక్వెల్ అంటే మాత్రం మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం వస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.