యాప్నగరం

​ఆ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన శంకర్!

తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం

TNN 10 Jul 2017, 10:41 am
వడివేలు హీరోగా తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘హింసించే రాజు 23వ పులకేశి‌’. శింబుదేవన్ దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్ శంకర్ నిర్మాణంలో రూపొందిన ఆ సినిమా తమిళంలో విజయం సాధించడంతో, తెలుగులోకి కూడా అనువదించారు. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో మాత్రం విపరీత జనాదరణతో ఆ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది.
Samayam Telugu sequel for vadivelu movie
​ఆ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన శంకర్!


ఆ తర్వాత శింబుదేవన్ పలు సినిమాలు రూపొందించినా అవేవీ పులకేశి అంత హిట్ కాలేదు. ఇక వడివేలు హీరోగా కొన్ని సినిమాలు వచ్చినా అవి కూడా ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేదు. కొన్ని పరిణామాల నేపథ్యంలో కమేడియన్ గా కూడా వడివేలు కెరీర్ ఇప్పుడంత గొప్పగా లేదు.




ఈ నేపథ్యంలో పులకేశి సినిమాకు సీక్వెల్ రానున్నదని స్పష్టత వచ్చింది. చాన్నాళ్లుగానే ఇందుకు సంబంధించిన ఊహాగానాలున్నా.. ఇప్పుడు నిర్మాత హోదాలో శంకర్ సీక్వెల్ ను ధ్రువీకరించారు. త్వరలోనే రెండో పార్టు రానున్నదనే స్పష్టతను ఇచ్చాడు. ఈ మేరకు ట్విటర్ లో ఒక కార్టూన్ ను పోస్టు చేసి సీక్వెల్ విషయాన్ని ప్రకటించారు శంకర్. తోకను పట్టుకుని ఏనుగు ఎక్కే ప్రయత్నంలో ఉన్న పులకేశి కార్టూన్ ఆకట్టుకుంటోంది. సీక్వెల్ పార్టుకు కూడా శింబుదేవనే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.