యాప్నగరం

మన్మధుడు-2, సీక్వెల్‌ పార్ట్‌లో హీరో ఎవరు?

అక్కినేని నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటి ‘మన్మధుడు’.

Samayam Telugu 13 Aug 2018, 4:09 pm
అక్కినేని నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటి ‘మన్మధుడు’. త్రివిక్రమ్ రచనలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చింది. సరదా సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారం అవుతూ అలరిస్తూ ఉంటుంది. త్రివిక్రమ్ స్టైల్ రచన ఈ సినిమాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది.
Samayam Telugu manmadhudu


ఇప్పుడు ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ‘మన్మధుడు’కు సీక్వెల్ రాబోతోంది అనేది. ఈ మేరకు టైటిల్ కూడా రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. అది కూడా మన్మధుడును నిర్మించిన అక్కినేని వారి హోం బ్యానర్ తరఫు నుంచినే ‘మన్మధుడు-2’ టైటిల్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. టైటిల్ ను బట్టి మన్మధుడుకు సీక్వెల్ వస్తోందని అనుకోవాలి.

అయితే ఇందులో హీరో ఎవరు? అనేది ఇంకా స్పష్టత లేని అంశమే. నాగార్జునే ఈ సీక్వెల్ పార్టులో నటిస్తారా? లేక ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్‌లలో ఎవరో ఒకరు రెండో మన్మధుడుగా కనిపిస్తారా? అనే అంశాలు ఆసక్తిదాయకమైనవే. మన్మధుడు సీక్వెల్ పార్టును రూపొందించే దర్శకుడు ఎవరు? అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.