యాప్నగరం

షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, జూహీ చావ్లాకి ఈడీ నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతడి భార్య గౌరి ఖాన్, నటి జూహీ చావ్లాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది.

TNN 25 Mar 2017, 9:38 am
కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్‌కి ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, అతడి భార్య గౌరి ఖాన్, నటి జూహీ చావ్లాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఫారెన్ ఎక్చేంజ్ మేనేజ్ యాక్ట్(ఫెమా) చట్టం కింద ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. 2009లో మార్షియస్‌కి చెందిన ఓ కంపెనీకి ఈ ముగ్గురు తమ కంపెనీలోని కొన్ని షేర్స్‌ని తక్కువ ధరకి అమ్మిన కారణంగా, ఫారెన్ ఎక్చేంజ్ రూపంలో ప్రభుత్వానికి రూ.73.6 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
Samayam Telugu shah rukh khan and juhi chawla gets ed notice for violation of fema
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, జూహీ చావ్లాకి ఈడీ నోటీసులు


ఈ షేర్స్‌ని కొనుగోలు చేసిన మార్షియస్‌కి చెందిన కంపెనీ ది సీ ఐస్లాండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ లిమిటెడ్(టీఎస్ఐఐఎల్) మరెవరిదో కాదు... జూహీ చావ్లా భర్త జే మెహ్తానే ఆ కంపెనీ యజమాని. గతంలోనే ఈ కేసుకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, షేర్స్ అమ్మకాలు వంటి అంశాలపై షారుఖ్ ఖాన్ వాంగ్మూలం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షారుఖ్, గౌరి, జూహీలపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసింది.

ఓ రెండు వారాల్లో ఈ ముగ్గురిని అంతిమ విచారణకి పిలిచి, ఫెమా చట్టం కింద ఉల్లంఘణలకి పాల్పడినందుకు వారికి జరిమానా విధించే అవకాశం వుందని సమాచారం. ఫేమా చట్టం కింద నమోదైన కేసులలో నిందితులు దోషులుగా తేలినట్టయితే, ప్రభుత్వం నష్టపోయిన మొత్తానికి మూడింతల మొత్తం జరిమానా విధించడం అనేది గరిష్టమైన శిక్షగా వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.