హైదరాబాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ నుంచి రీసెంట్గా గౌరవ డాక్టరేట్ సత్కారం అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు టి. సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున మరో గౌరవాన్ని అందుకోనున్నారు.
షారూక్ ఖాన్కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా , పద్మిని కొల్హాపురి, బోనీకపూర్ లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్ చోప్రా 4వ జాతీయ అవార్డుకు గాను సుప్రసిద్ధ నటుడు షారూక్ ఖాన్ను ఎంపిక చేసింది. గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ గాయని లత మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖ అందుకున్నారు.
యశ్ చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును డా. టి. సుబ్బరామిరెడ్డి 'టి.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరుపై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రంను అవార్డు గ్రహీతకు అందించనున్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబైలోని హోటల్ మారియట్లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర ప్రముఖులు ఈ అవార్డు వేడుకలో పాల్గొననున్నారు
షారూక్ ఖాన్కు 'యశ్ చోప్రా' 4వ జాతీయ అవార్డును ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా , పద్మిని కొల్హాపురి, బోనీకపూర్ లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్ చోప్రా 4వ జాతీయ అవార్డుకు గాను సుప్రసిద్ధ నటుడు షారూక్ ఖాన్ను ఎంపిక చేసింది. గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ గాయని లత మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖ అందుకున్నారు.
యశ్ చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును డా. టి. సుబ్బరామిరెడ్డి 'టి.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరుపై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రంను అవార్డు గ్రహీతకు అందించనున్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబైలోని హోటల్ మారియట్లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర ప్రముఖులు ఈ అవార్డు వేడుకలో పాల్గొననున్నారు